మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో కుండపోత వర్షం కురుసింది. దీంతో డోర్నకల్ రైల్వేస్టేషన్లో పట్టాల పైనుంచి వరదనీరు పారుతోంది. రైల్వే ట్రాక్లు మునిగిపోయాయి. ఫలితంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
రైళ్ల రాకపోకలు నిలిపివేత…!

వరద నీరు ఎక్కువగా ఉండటంతో… డోర్నకల్ రైల్వేస్టేషన్లో గోల్కొండ ఎక్స్ప్రెస్, మహబూబాబాద్లో కోణార్క్ ఎక్స్ప్రెస్లను తాత్కాలికంగా నిలిపివేశారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే స్టేషన్ సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు. స్టేషన్లోకి భారీగా వరద నీరు చేరి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేస్తున్నారు. కొన్ని రైళ్లను దారి మళ్లీస్తున్నారు.
మొంథా తుపాను, వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. 127 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయడంతో పాటు మరో 14 రైళ్లను దారి మళ్లించింది. ఇందులో ఏపీ, తెలంగాణ మీదుగా నడిచే రైళ్లు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని రూట్లలో గూడ్స్ రైళ్లను కూడా నిలిపివేశారు.
తుఫాన్ ప్రభావంతో మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మంలో భారీ వర్షాలు కురిస్తున్నాయి. దీని ఫలితంగా మున్నేరు ఉగ్రరూపం దాల్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమవుతున్నారు. గతేడాది వరదల దృష్ట్యా… ఈసారి ముందస్తు జాగ్రత్తలు తీసుకునే పనిలో పడ్డారు.
ఈ జిల్లాలకు హెచ్చరికలు
{{/usCountry}}తుఫాన్ ప్రభావంతో మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మంలో భారీ వర్షాలు కురిస్తున్నాయి. దీని ఫలితంగా మున్నేరు ఉగ్రరూపం దాల్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమవుతున్నారు. గతేడాది వరదల దృష్ట్యా… ఈసారి ముందస్తు జాగ్రత్తలు తీసుకునే పనిలో పడ్డారు.
ఈ జిల్లాలకు హెచ్చరికలు
{{/usCountry}}మరోవైపు ఇవాళ (అక్టోబర్ 29) తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇక ఆసిఫాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక హైదరాబాద్ లో రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. ఇవాళ ఉదయం నుంచే ముసురు పడుతోంది. కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుండగా… రోడ్లన్నీ జలమయమయ్యాయి.
భారీ వర్షాల నేపథ్యంలో నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్ నగర్, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు ప్రకటన విడుదల చేశారు.