కాపురానికి రావట్లేదని భార్య ముక్కు కొరికేసిన భర్త.. మంచిర్యాలలో దారుణం!
మంచిర్యాల జిల్లాలో ఘోరమైన ఘటన వెలుగుచూసింది. భార్యపై కోపంతో ఆమె ముక్కు కొరికేశాడు భర్త. దీంతో భార్య ముక్కు తెగిపడింది.
మంచిర్యాల జిల్లాలో కుటుంబ కలహాలు తీవ్ర విషాదానికి దారితీశాయి. క్షణికావేశం ఓ కుటుంబాన్ని తీవ్ర వేదనలోకి నెట్టింది. కోటపల్లి మండలంలో చోటుచేసుకున్న ఈ అమానుష సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

కోటపల్లి మండలం మల్లంపేట గ్రామానికి చెందిన మణిచందర్కు, అదే మండలానికి చెందిన మమతతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికిద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్ల పాటు వీరి సంసారం సాఫీగానే సాగినా, ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం కూడా ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. భర్త వేధింపులను తట్టుకోలేకపోయిన మమత, మనస్తాపంతో కోటపల్లిలోని తన తల్లిగారింటికి వెళ్లిపోయింది.
భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన మణిచందర్, తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ తీవ్రస్థాయిలో హంగామా సృష్టించి, అడ్డువచ్చిన మామపై దాడి చేశాడు. ఈ దాడిలో మామకు తీవ్ర గాయాలయ్యాయి. మామను కర్రతో కొట్టాడు.
అంతటితో ఆగకుండా ఆవేశంలో విచక్షణ కోల్పోయిన మణిచందర్ తన భార్య మమతపై పడి ఆమె ముక్కును బలంగా కొరికేశాడు. దీంతో మమత ముక్కు తీవ్రంగా తెగిపోయి రక్తం అదుపులేకుండా కారింది. బాధితురాలి కేకలతో స్థానికులు వచ్చారు. ఆ ఘటన చూసి భయాందోళనలకు గురయ్యారు.
తీవ్రంగా గాయపడిన మమతను స్థానికులు వెంటనే అంబులెన్స్లో చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి, ఆపై వరంగల్లోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు కోటపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎనిమిదేళ్ల బంధం, ఇద్దరు పిల్లల భవిష్యత్తును కూడా పక్కనబెట్టి భర్త ప్రవర్తించిన తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా ఆ జంట తరచుగా గొడవ పడుతున్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం, మమత, మణిచందర్ల మధ్య కట్నం విషయంలో వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాత మమత తన తల్లి ఇంటికి వెళ్ళిందని సమాచారం.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


