సంక్రాంతి వేళ పతంగుల జోరు కొనసాగుతోంది. అయితే చైనా మాంజా వాడకంపై హైదరాబాద్ నగర పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెడుతున్నారు. ఎక్కడైనా అమ్మినట్లు సమాచారం అందితే చాలు… కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సాధారణ దారాలను మాత్రమే వాడాలని…. చైనా మాంజాను వాడొద్దని స్పష్టం చేస్తున్నారు.

చైనా మాంజా విషయంపై హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేశారు. పతంగుల జోరు.. ఇతరుల పాలిట యమపాశం కావొద్దని సూచించారు. “సంక్రాంతి అంటేనే సంబరం. ఏడాదికోసారి వచ్చే ఈ పండుగ నాడు ఆకాశమంతా రంగురంగుల పతంగులు ఎగరేయడం మన ఆనవాయితీ. కానీ, కొందరి నిర్లక్ష్యం వల్ల ఈ పండుగ పక్షులకు, వాహనదారులకు శాపంగా మారుతోంది. పండుగ పూట మీకున్న ఆనందం.. ఇతరుల ఇంట విషాదం నింపకూడదు” అని కోరారు.
సంపూర్ణ నిషేధం ఉంది - సీపీ సజ్జనార్
“చైనా మాంజాపై సంపూర్ణ నిషేధం ఉంది. నైలాన్, గాజు పొడి అద్దిన సింథటిక్ దారాలను (చైనా మాంజా) అమ్మినా, కొన్నా, వాడినా చట్టం ఊరుకోదు. ఈ దారాలు పర్యావరణానికే కాదు.. పక్షుల పాలిట యమపాశంలా మారుతున్నయ్. రోడ్ల మీద పోయే బైకర్ల మెడకు మాంజా చుట్టుకొని గొంతు తెగిపోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నం. మీ సరదా అమాయకుల ప్రాణాలను బలిగొనకూడదు” అని సజ్జనార్ పేర్కొన్నారు.
“కరెంట్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల కాడ పతంగులు ఎగరేయొద్దు. ఒకవేళ పతంగి కరెంట్ తీగల్లో ఇరుక్కుంటే.. ఇనుప రాడ్లతో గానీ, తడి చేతులతో గానీ లాగడానికి ట్రై చేయకండి. కరెంట్ షాక్ కొట్టి ప్రాణాలకే ముప్పు రావొచ్చు. జర భద్రం! పిట్టగోడలు (Parapets) లేని డాబాల మీద చిన్నపిల్లలను ఒంటరిగా పతంగులు ఎగరేయనివ్వొద్దు. పతంగి ద్యాసలో పడి పిల్లలు కిందపడే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు పిల్లలను ఓ కంట కనిపెట్టుకుని ఉండాలి” అని తల్లిదండ్రులకు సీపీ సజ్జనార్ సూచించారు.
చైనా మాంజా అమ్మేటోళ్లపై, వాడేటోళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టామని సజ్జనార్ స్పష్టం చేశారు. “ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే పర్యావరణ పరిరక్షణ చట్టం కింద కేసులు బుక్ చేస్తాం. కేవలం కాటన్ దారాలను మాత్రమే వాడండి. మూగజీవాలను, మనుషుల ప్రాణాలను కాపాడండి. సేఫ్గా సంక్రాంతి పండుగ చేసుకోండి” అని హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు.
{{/usCountry}}చైనా మాంజా అమ్మేటోళ్లపై, వాడేటోళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టామని సజ్జనార్ స్పష్టం చేశారు. “ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే పర్యావరణ పరిరక్షణ చట్టం కింద కేసులు బుక్ చేస్తాం. కేవలం కాటన్ దారాలను మాత్రమే వాడండి. మూగజీవాలను, మనుషుల ప్రాణాలను కాపాడండి. సేఫ్గా సంక్రాంతి పండుగ చేసుకోండి” అని హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు.
{{/usCountry}}