హైదరాబాద్ సిటీకి చెందిన ఫైసల్ రెహ్మాన్ అనే వ్యక్తి ద్విచక్రవాహనం చోరీకి గురైంది. ఈ ఘటన జరిగి మూడు నెలలవుతుంది. ఈ చోరీ ఘటనపై యజమాని రెహ్మాన్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు… దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ-చలానాతో వెలుగులోకి….

మూడు నెలలు గడిచినా వాహనం ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు దొరకలేదు. కట్ చేస్తే యజమాని అయిన ఫైసల్ రెహ్మాన్ ఫోన్కు ఈ- చలానా మెసేజ్ వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే… షాక్ అయిపోయాడు. తన బైక్ కనిపించటమే కాదు… ఓ వ్యక్తి నడపుతున్నట్లు ఉంది. వెంటనే అప్రమత్తమైన రెహ్మాన్… మరోసారి సోషల్ మీడియా వేదికగా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రెహ్మాన్ ద్విచక్రవాహనానికి ఈ-చలాన్ విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మెసేజ్ పంపారు. తన వద్ద బైక్ లేదు కదా…. ఈ చలానా ఏంటా అని పరేషాన్ అయ్యాడు. ఆ తర్వాత ట్రాఫిక్ పోలీస్ వెబ్ సైట్కి వెళ్లి పరిశీలించాడు. ఆ సైట్లో తన ద్విచక్రవాహనంపై మరో వ్యక్తి కూర్చుని ఉన్న ఫొటో ఉంది. అలర్ట్ అయిన రెహ్మాన్…. తన బైక్ మూడు నెలల కిందట చోరీ అయిందని… ఈ ఫొటోలో ఉన్న వ్యక్తే నిందితుడని ట్వీట్ చేశాడు. పోలీసులకు ట్యాగ్ చేస్తూ… గతంలో నమోదైన ఎఫ్ఐఆర్ కాపీని జత చేశాడు.
ఈ ఘటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఈ బైక్ ను నడుపుతున్న వ్యక్తి దొంగ కావచ్చు లేదా నకిలీ కాగితాలతో ఈ వాహనాన్ని విక్రయించిన అమాయకుడు కావొచ్చు అంటూ ఓ నెటిజన్ రియాక్ట్ అయ్యాడు. "అతను తెలియకుండానే దొంగ నుంచి నకిలీ పత్రాలతో దొంగిలించబడిన వాహనాన్ని కొనుగోలు చేస్తే… అతన్ని ఎలా నిందిస్తాం..? అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు. పోలీసులు విచారణ జరిపి… బాధితుడికి వెంటనే న్యాయం చేయాలని మరికొందరు రాసుకొచ్చారు.
(Disclaimer: ఈ కథనం సోషల్ మీడియాలో పోస్ట్ అయిన (@rahman0528 -యూజర్ ) సమాచారం ఆధారంగా పబ్లిష్ చేయడం జరిగింది. ఇందులోని వివరాలు హిందుస్తాన్ టైమ్స్ వి కావు)
{{/usCountry}}ఈ ఘటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఈ బైక్ ను నడుపుతున్న వ్యక్తి దొంగ కావచ్చు లేదా నకిలీ కాగితాలతో ఈ వాహనాన్ని విక్రయించిన అమాయకుడు కావొచ్చు అంటూ ఓ నెటిజన్ రియాక్ట్ అయ్యాడు. "అతను తెలియకుండానే దొంగ నుంచి నకిలీ పత్రాలతో దొంగిలించబడిన వాహనాన్ని కొనుగోలు చేస్తే… అతన్ని ఎలా నిందిస్తాం..? అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు. పోలీసులు విచారణ జరిపి… బాధితుడికి వెంటనే న్యాయం చేయాలని మరికొందరు రాసుకొచ్చారు.