హైదరాబాద్ జూ పార్క్కు వంతారా నుండి కంగారూలు, జీబ్రాలు రానున్నాయ్
హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్లో మరికొన్ని జంతువులు సందడి చేయనున్నాయి. వంతారా నుంచి కంగారూలు, జీబ్రాలను తీసుకువచ్చేందుకు అధికారులు ప్రణాళికలు వేశారు.
నెహ్రూ జూలాజికల్ పార్క్ను సందర్శించే పిల్లలు, కుటుంబాలు, వన్యప్రాణి ప్రేమికులు త్వరలో మొదటిసారిగా కంగారూలను చూడబోతున్నారు. జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా ఈ ఆస్ట్రేలియా జాతి జంతువులను తీసుకురావడానికి హైదరాబాద్ జూ సిద్ధమవుతోంది.

గుజరాత్లోని జామ్నగర్లో రిలయన్స్ ఫౌండేషన్ నడుపుతున్న అంతర్జాతీయ వన్యప్రాణుల రక్షణ, పరిరక్షణ కేంద్రమైన వంతారా నుండి ఒక జత కంగారూలను తీసుకురానున్నారు. వాటి కోసం ఎన్క్లోజర్లు, రాత్రిపూట నివాస గృహాలను ఇప్పటికే సిద్ధం చేసినట్లు జూ అధికారులు తెలిపారు. వంతారా డైరెక్టర్ బ్రిజ్ కిషోర్ గుప్తా నేతృత్వంలోని ఒక బృందం ఇటీవల హైదరాబాద్ జూలోని సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను తనిఖీ చేసింది.
'జూలో కంగారూలు ఉండటం ఇది మొదటిసారి. మేం త్వరలో వంతారా నుండి ఒక మగ, ఒక ఆడ కంగారూను తీసుకుంటాం. అవి వచ్చిన తర్వాత, వాటిని ప్రదర్శనకు ఉంచే ముందు కొన్ని రోజుల పాటు క్వారంటైన్లో ఉంచుతాం.' అని నెహ్రూ జూలాజికల్ పార్క్కు చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు.
ఇప్పుడు వంతారా నుంచి వచ్చే కంగారూలకు బదులుగా హైదరాబాద్ జూ నుంచి ఏనుగులలోని ఒకదానిని వంతారాకు పంపనుంది. గతంలో 2020లో జపాన్లోని యోకోహామా జూలాజికల్ గార్డెన్స్ నుండి నాలుగు కంగారూలను తీసుకురావాలని హైదరాబాద్ జూ ప్రణాళిక వేసింది. కానీ కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఏర్పడిన అంతరాయాల వల్ల ఆ ఒప్పందాన్ని నిలిపివేశారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం జూలో ఒంటరిగా ఉన్న సన్నీ అనే మగ జిరాఫీకి త్వరలో ఒక ఆడ తోడు రానుంది. సీనియర్ అధికారులు ఇటీవల మైసూరు జూను సందర్శించి ఈ మార్పిడిని ఖరారు చేశారు. ఈ నెలాఖరులోగా జిరాఫీ వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జూలో 2,200 కంటే ఎక్కువ జంతువులు, పక్షులతో పాటు 199 జాతుల జీవులు ఉన్నాయి.
త్వరలో జీబ్రాలు కూడా ఇక్కడ మరింత సందడిగా చేయనున్నాయి. జూ త్వరలో వంతారా నుండి ఒక జత జీబ్రాలను తీసుకురానుంది. ఇప్పటికే ఆ కేంద్రం నుండి తీసుకువచ్చిన రెండు మగ, ఒక ఆడ జీబ్రాలతో కలిపి వీటి సంఖ్య పెరుగుతుంది. 37 ఏళ్ల విరామం తర్వాత హైదరాబాద్ జూకు జీబ్రాలు తిరిగి వచ్చాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


