...
...
Next Story

ఈ గ్రామంలో మనుషులకంటే కోతులే ఎక్కువ.. వాటిని తరిమినవారే సర్పంచ్!

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల హడావుడి మెుదలైంది. అయితే పలు గ్రామాల్లో సమస్యలకు పరిష్కారం చూపినవారే సర్పంచ్ అంటూ గ్రామస్థులు తీర్మానాలు చేస్తున్నారు.

Published on: Dec 1, 2025, 10:38:30 IST
Advertisement

గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల పండుగ మెుదలైంది. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రామాల్లో ఉన్న సమస్యలను జనాలు ముందుకు తీసుకువస్తున్నారు. పరిష్కారం చూపినవారికే ఓటు వేస్తాం లేదంటే ఏకగ్రీవం చేస్తామంటూ చెబుతున్నారు. వరంగల్ జిల్లాలో ఓ గ్రామం కోతుల సమస్యను తీర్చినవారికే తమ ఓటు అంటూ తీర్మానం చేసుకుంది.

గ్రామంలో కోతుల సమస్య
గ్రామంలో కోతుల సమస్య

వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామస్థులు కోతుల బెడదను అదుపు చేస్తామని హామీ ఇచ్చే అభ్యర్థిని సర్పంచ్‌గా ఎన్నుకుంటామని ఏకగ్రీవంగా ప్రకటించారు. 5,400 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో 20,000 కంటే ఎక్కువ కోతులు ఉన్నాయి. ఇది ఇక్కడ జనాభా కంటే నాలుగు రెట్లు ఎక్కువ. కోతులతో రోజువారీ జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జనాలు. కోతులు ప్రజలపై దాడి చేసి గాయపరుస్తున్నాయి కూడా. వంట పాత్రలను దొంగిలించడం, ఇళ్లను దెబ్బతీయడం చేస్తున్నాయి. ఒంటరిగా బయటకు అడుగు పెట్టాలంటే గ్రామస్థులు భయపడుతున్నారు.

తమకు కొత్త రోడ్లు లేదా ఇతర అభివృద్ధి గురించి పట్టింపు లేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ కోతుల సమస్యను పరిష్కరించండి.. మా ఓటు మీకే ఉంటుంది అంటున్నారు. పిల్లలు ఒంటరిగా పాఠశాలకు వెళ్లడానికి భయపడుతున్నారని, ఎందుకంటే కోతులు వారిపై దాడి చేస్తున్నాయని చెబుతున్నారు. కోతులను నియంత్రించే వారు తమ సర్పంచ్ అవుతారని స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో, గ్రామస్థులు ఈ సమస్యపై ఒకే గొంతుతో ఏకమయ్యారు.

21 పాయింట్ల మ్యానిఫెస్టో

మరోవైపు ఖమ్మం జిల్లాలో ముత్తాపురంలో అమెరికా నుండి తిరిగి వచ్చిన రావెల్లి కృష్ణారావు 21 పాయింట్ల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. గ్రామాభివృద్ధి కోసం తన జేబులో నుండి రూ.1 కోటి ఖర్చు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఐదేళ్లపాటు ఇంటి పన్ను, నీటి బిల్లుల నుండి మినహాయింపు, పేదలకు ఉచిత మందులతో నెలవారీ ఆరోగ్య శిబిరాలు, తరగతిలో టాపర్ విద్యార్థులకు 2,000 వార్షిక స్కాలర్‌షిప్‌ల హామీ ఇచ్చారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe