వేసవి కాలం ముగుస్తున్న తరుణంలో అందమైన కేరళ ప్రకృతి దృశ్యాలను, హిల్ స్టేషన్లను చూడాలనుకునే పర్యాటకుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించింది. "KERALA HILLS & WATERS" పేరుతో అందిస్తున్న ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీ జూన్ 16, 2026న ప్రారంభం కానుంది.

5 రాత్రులు, 6 పగళ్ల పాటు సాగే ఈ టూర్ ద్వారా కేరళలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన మూన్నార్, అలెప్పీ సందర్శించవచ్చు. సికింద్రాబాద్, హైదరాబాద్, నల్గొండ, గుంటూరు జంక్షన్, తెనాలిలో రైలు ఎక్కవచ్చు.
డే 1 (జూన్ 16)
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 2.25కి శబరి ఎక్స్ప్రెస్ ఉంటుంది. రాత్రంతా జర్నీ చేయాలి.
డే 2
రెండో రోజు మొత్తం ఉదయం 11.30కి అలువా రైల్వే స్టేషన్ చేరుకుంటారు. హోటల్లో చెక్ ఇన్ అవూతారు. మూన్నార్ కొన్ని ప్రదేశాలను చూస్తారు. రాత్రికి మున్నార్లోనే బస.
డే 3
ఉదయాన్నే అల్పాహారం ముగించుకుని ఎరవికుళం జాతీయ పార్కును సందర్శిస్తారు. తరువాత టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్, ఎకో-పాయింట్ను సందర్శించండి. రాత్రి బస మున్నార్లోనే చేస్తారు.
డే 4
చెక్ అవుట్ చేసి అలప్పుజకు (170 కి.మీ.) బయలుదేరుతారు. అక్కడ హోటల్లో చెక్ ఇన్ చేయండి. బ్యాక్వాటర్స్ను ఆస్వాదిస్తారు. రాత్రి బస అలప్పుజలోనే ఉంటుంది.
డే 5
5వ రోజు శనివారం చెక్ అవుట్ చేసి ఎర్నాకుళంకు (60 కి.మీ.) బయలుదేరుతారు. ఉదయం 11:15 గంటలకు రైలు నెం. 20630, శబరి ఎక్స్ప్రెస్ ఎక్కడానికి ఎర్నాకుళం టౌన్ రైల్వే స్టేషన్లో దిగుతారు. రాత్రి ప్రయాణం ఉంటుంది.
డే 6 (జూన్ 21)
ఆరో రోజు ఉదయం 11:00 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీనితో టూర్ ముగుస్తుంది.
టూర్ ప్యాకేజీ ధరల వివరాలు
{{/usCountry}}ఆరో రోజు ఉదయం 11:00 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీనితో టూర్ ముగుస్తుంది.
టూర్ ప్యాకేజీ ధరల వివరాలు
{{/usCountry}}ఈ ప్యాకేజీ ధరలు మీరు ఎంచుకునే వసతి రకాన్ని బట్టి మారుతుంటాయి. సింగిల్ ఆక్యుపెన్సీ కంఫర్ట్ 3ఏలో (ఒక్కరే ప్రయాణిస్తే): రూ. 32240, స్టాండర్డ్ అయితే రూ.32730గా ఉంది. ట్విన్ షేరింగ్ కంఫర్ట్ 3ఏలో రూ.18970, స్టాండర్డ్లో రూ.17720 నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ కంఫర్ట్ 3ఏలో రూ.16440, స్టాండర్డ్లో రూ.15060 నిర్ణయించారు. పిల్లలకు (5-11 సంవత్సరాలు): బెడ్ కావాలనుకుంటే ప్రత్యేక తగ్గింపు ధరలు వర్తిస్తాయి. దీనికోసం ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ www.irctctourism.com చూడండి.
ఎలా బుక్ చేసుకోవాలి?
జూన్ 16న ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీలో సీట్లు పరిమితంగా ఉంటాయి. ఆసక్తి గల పర్యాటకులు ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ www.irctctourism.com ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. లేదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని ఐఆర్సీటీసీ పర్యాటక సమాచార కేంద్రంలో నేరుగా సంప్రదించి టికెట్లు రిజర్వ్ చేసుకోవచ్చు.