...
...
Next Story

IRCTC Kerala Tour : కేరళ వెళ్లాలనుకుంటున్నారా? జూన్ 16న ఐఆర్‌సీటీసీ క్రేజీ టూర్ ప్యాకేజీ.. వివరాలు ఇవే!

IRCTC Kerala Tour : జూన్ 16న IRCTC KERALA HILLS & WATERS టూర్ ప్యాకేజీ ఉంది. అలెప్పీ, మున్నార్ ప్రాంతాలను చూసి రావొచ్చు. ఈ 6 రోజుల టూర్ ప్యాకేజీ ధరలు, షెడ్యూల్ పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Published on: Jun 6, 2026, 09:23:17 IST
Advertisement

వేసవి కాలం ముగుస్తున్న తరుణంలో అందమైన కేరళ ప్రకృతి దృశ్యాలను, హిల్ స్టేషన్లను చూడాలనుకునే పర్యాటకుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించింది. "KERALA HILLS & WATERS" పేరుతో అందిస్తున్న ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీ జూన్ 16, 2026న ప్రారంభం కానుంది.

ఐఆర్‌సీటీసీ కేరళ టూర్ ప్యాకేజీ
ఐఆర్‌సీటీసీ కేరళ టూర్ ప్యాకేజీ

5 రాత్రులు, 6 పగళ్ల పాటు సాగే ఈ టూర్ ద్వారా కేరళలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన మూన్నార్, అలెప్పీ సందర్శించవచ్చు. సికింద్రాబాద్, హైదరాబాద్, నల్గొండ, గుంటూరు జంక్షన్, తెనాలిలో రైలు ఎక్కవచ్చు.

డే 1 (జూన్ 16)

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 2.25కి శబరి ఎక్స్‌ప్రెస్ ఉంటుంది. రాత్రంతా జర్నీ చేయాలి.

డే 2

రెండో రోజు మొత్తం ఉదయం 11.30కి అలువా రైల్వే స్టేషన్ చేరుకుంటారు. హోటల్‌లో చెక్ ఇన్ అవూతారు. మూన్నార్ కొన్ని ప్రదేశాలను చూస్తారు. రాత్రికి మున్నార్‌లోనే బస.

డే 3

ఉదయాన్నే అల్పాహారం ముగించుకుని ఎరవికుళం జాతీయ పార్కును సందర్శిస్తారు. తరువాత టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్, ఎకో-పాయింట్‌ను సందర్శించండి. రాత్రి బస మున్నార్‌లోనే చేస్తారు.

డే 4

చెక్ అవుట్ చేసి అలప్పుజకు (170 కి.మీ.) బయలుదేరుతారు. అక్కడ హోటల్‌లో చెక్ ఇన్ చేయండి. బ్యాక్‌వాటర్స్‌ను ఆస్వాదిస్తారు. రాత్రి బస అలప్పుజలోనే ఉంటుంది.

డే 5

5వ రోజు శనివారం చెక్ అవుట్ చేసి ఎర్నాకుళంకు (60 కి.మీ.) బయలుదేరుతారు. ఉదయం 11:15 గంటలకు రైలు నెం. 20630, శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కడానికి ఎర్నాకుళం టౌన్ రైల్వే స్టేషన్‌లో దిగుతారు. రాత్రి ప్రయాణం ఉంటుంది.

డే 6 (జూన్ 21)

ఈ ప్యాకేజీ ధరలు మీరు ఎంచుకునే వసతి రకాన్ని బట్టి మారుతుంటాయి. సింగిల్ ఆక్యుపెన్సీ కంఫర్ట్ 3ఏలో (ఒక్కరే ప్రయాణిస్తే): రూ. 32240, స్టాండర్డ్ అయితే రూ.32730గా ఉంది. ట్విన్ షేరింగ్ కంఫర్ట్ 3ఏలో రూ.18970, స్టాండర్డ్‌లో రూ.17720 నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ కంఫర్ట్ 3ఏలో రూ.16440, స్టాండర్డ్‌లో రూ.15060 నిర్ణయించారు. పిల్లలకు (5-11 సంవత్సరాలు): బెడ్ కావాలనుకుంటే ప్రత్యేక తగ్గింపు ధరలు వర్తిస్తాయి. దీనికోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.com చూడండి.

ఎలా బుక్ చేసుకోవాలి?

జూన్ 16న ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీలో సీట్లు పరిమితంగా ఉంటాయి. ఆసక్తి గల పర్యాటకులు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.com ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. లేదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ఐఆర్‌సీటీసీ పర్యాటక సమాచార కేంద్రంలో నేరుగా సంప్రదించి టికెట్లు రిజర్వ్ చేసుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe