ఐఆర్సీటీసీ టెంపుల్స్ ఆఫ్ తమిళనాడు టూర్.. బడ్జెట్ ధరలో అద్భుతాలు చూసి రావొచ్చు!
తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలనుకునేవారికి గుడ్న్యూస్. త్వరలో ఐఆర్సీటీసీ టెంపుల్స్ ఆఫ్ తమిళనాడు టూర్ ఉంది.
తమిళనాడులోని ఆలయాలను సందర్శించాలనుకునేవారి కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. అదే టెంపుల్స్ ఆఫ్ తమిళనాడు. ఇందులో మీరు ప్రముఖ ఆలయాలను సందర్శి్స్తారు. తంజావూరు, కుంభకోణం, పుదుచ్చేరి, కాంచీపురం లాంటి ప్రముఖ ప్రదేశాలకు వెళ్తారు. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీ డిసెంబర్ 6వ తేదీన అందుబాటులో ఉంది. ఆరు రాత్రులు, 7 రోజుల టూర్ ఇది.

ఏడు రోజులు ఇలా
మెుదటి రోజు హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం బయల్దేరి తిరుచ్చి వెళ్తారు. తర్వాత హోటల్లో చెకిన్ అవుతారు. డిన్నర్ చేసి తిరుచ్చిలోనే స్టే ఉంటుంది.
రెండో రోజు హోటల్లో అల్పాహారం చేసి శ్రీరంగం ఆలయం, జంబుకేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత చెక్ అవుట్ చేసి తంజావూరుకు బయలుదేరుతారు. బృహదీశ్వర ఆలయాన్ని సందర్శించి.. సాయంత్రం కుంభకోణం వెళ్తారు. రాత్రి భోజనం చేసి కుంభకోణంలోనే బస చేస్తారు.
మూడో రోజు హోటల్లో అల్పాహారం చేసి ఐరావతేశ్వర ఆలయం, సారంగపాణి ఆలయం, కాశీ విశ్వనాథర్ ఆలయాన్ని సందర్శించండి. డిన్నర్ చేసి నైట్ కుంభకోణంలోనే బస చేస్తారు.
నాలుగో రోజు అల్పాహారం చేసి చెక్ అవుట్ అవుతారు. గంగైకొండ చోళపురం సందర్శిస్తారు. తరువాత చిదంబరం బయలుదేరుతారు. నటరాజ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత పుదుచ్చేరికి బయలుదేరి వెళ్తారు. హోటల్లో చెక్ ఇన్ చేస్తారు. డిన్నర్ చేసి పుదుచ్చేరిలో రాత్రి బస ఉంటుంది.
ఐదో రోజు హోటల్లో అల్పాహారం చేసిన తర్వాత ఆరోవిల్లె సందర్శించాలి. మధ్యాహ్నం పారడైజ్ బీచ్ వెళ్తారు. డిన్నర్ చేసిన తర్వాత రాత్రికి పుదుచ్చేరిలోనే బస చేస్తారు.
ఆరో రోజు అల్పాహారం చేసిన తర్వాత చెక్ అవుట్ చేయాలి. తిరువన్నమలైకి బయలుదేరి వెళ్తారు. హోటల్లో చెక్ ఇన్ చేయాలి. అరుణాచలం ఆలయాన్ని సందర్శించండి. డిన్నర్ చేసి రాత్రి తిరువన్నమలైలో బస ఉంటుంది.
ఏడో రోజు అల్పాహారం చేసి చెక్ అవుట్ చేస్తారు. కాంచీపురం వెళ్తారు. కామాక్షి ఆలయం, కైలాసనాథర్ ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం చెన్నై వెళ్తారు. విమానం ఎక్కి హైదరాబాద్కు అర్ధరాత్రికి చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ధరలు
ఐఆర్సీటీసీ టెంపుల్స్ ఆప్ తమిళనాడు టూర్ ప్యాకేజీ ధర చూస్తే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.34,600, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.36000, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.48750గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ www.irctctourism.com సందర్శించవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


