తెలుగు రాష్ట్రాల నుంచి దివ్య దక్షిణ యాత్ర : అరుణాచలం, రామేశ్వరంతో పాటు ఏడు పుణ్యక్షేత్రాల దర్శనం! ప్యాకేజీ వివరాలు
IRCTC Divya Dakshin Yatra Package 2026 : తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం ఐఆర్సీటీసీ 'దివ్య దక్షిణ యాత్ర' ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. మే 24న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక భారత్ గౌరవ్ రైలు యాత్రలో…. దక్షిణ భారతదేశంలోని 7 ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు.
IRCTC Divya Dakshin Yatra Package 2026 : దక్షిణ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన, చారిత్రాత్మక పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తుల కోసం IRCTC సరికొత్త ఆధ్యాత్మిక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. 'దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం - చిదంబరం' పేరుతో ఒక ప్రత్యేక 'భారత్ గౌరవ్' టూరిస్ట్ రైలును ప్రకటించింది.

ఈ వేసవి కాలంలో పవిత్ర క్షేత్రాలను అత్యంత సౌకర్యవంతంగా, తక్కువ ఖర్చుతో దర్శించుకోవడానికి ఈ యాత్ర అద్భుతమైన అవకాశంగా నిలవనుంది. ఈ ప్రత్యేక టూరిస్ట్ రైలు మే 24వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. మొత్తం 7 రాత్రులు, 8 పగళ్ల పాటు (8 రోజులు) సాగే ఈ యాత్రలో దక్షిణ భారత దేశంలోని ప్రముఖ శైవ, వైష్ణవ మరియు శక్తి పీఠాలకు సంబంధించిన ఏడు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను భక్తులకు చూపిస్తారు.
దర్శించుకునే ప్రముఖ పుణ్యక్షేత్రాలు :
- తిరువణ్ణామలై (అరుణాచలం): పవిత్రమైన అరుణాచలేశ్వర ఆలయ దర్శనం.
- రామేశ్వరం: ప్రసిద్ధ రామనాథస్వామి దేవాలయం, పవిత్ర తీర్థాల సందర్శన.
- మధురై: లక్ష్మీ అవతారమైన మీనాక్షి అమ్మవారి ఆలయ దర్శనం.
- కన్యాకుమారి: సముద్ర తీరంలోని కుమారి అమ్మన్ టెంపుల్, వివేకానంద రాక్ మెమోరియల్.
- తిరుచిరాపల్లి (త్రిచి) : ప్రసిద్ధ శ్రీ రంగనాథస్వామి ఆలయం (శ్రీరంగం).
- తంజావూరు: చోళుల కాలం నాటి చారిత్రాత్మక బృహదీశ్వరాలయం (పెద్ద గుడి).
- చిదంబరం: నటరాజ స్వామి కొలువైన ప్రసిద్ధ ఆకాశలింగ క్షేత్రం.
తెలుగు రాష్ట్రాల భక్తుల సౌకర్యార్థం ఈ రైలుకు సికింద్రాబాద్, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుంది.
ఈ రైలులో భక్తుల బడ్జెట్కు అనుగుణంగా స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ కోచ్ల సదుపాయం ఉంది. కేంద్ర ప్రభుత్వం 'భారత్ గౌరవ్ రైలు' పథకం కింద అందిస్తున్న సుమారు 33 శాతం రాయితీని కలుపుకుని ప్యాకేజీ ధరలను నిర్ణయించారు.
- ఎకానమీ (స్లీపర్ క్లాస్): పెద్దలకు రూ. 14,500; పిల్లలకు (5-11 ఏళ్లు) రూ. 13,500.
- స్టాండర్డ్ (3 AC): పెద్దలకు రూ. 21,700; పిల్లలకు రూ. 20,600.
- కంఫర్ట్ (2 AC): పెద్దలకు రూ. 27,900; పిల్లలకు రూ. 26,600.
ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకున్న భక్తులకు రైలు ప్రయాణ టికెట్లతో పాటు బడ్జెట్ హోటళ్లలో బస సౌకర్యం కల్పిస్తారు. ప్రయాణంలో ప్రతిరోజూ ఉదయం టీ, అల్పాహారం ఉంటుంది. మధ్యాహ్నం, రాత్రి వేళల్లో స్వచ్ఛమైన శాకాహార భోజనాన్ని ఐఆర్సీటీసీనే సమకూరుస్తుంది. రైల్వే స్టేషన్ల నుంచి ఆలయాలకు వెళ్లడానికి ఎకానమీ, స్టాండర్డ్ క్లాస్ వారికి నాన్-ఏసీ వాహనాలు, కంఫర్ట్ క్లాస్ వారికి ఏసీ వాహనాల రవాణా సౌకర్యం ఉంటుంది. వీటితో పాటు ప్రయాణికులందరికీ ఉచిత ట్రావెల్ ఇన్సూరెన్స్ (ప్రయాణ బీమా), రైలులో ప్రత్యేక సెక్యూరిటీ, అండగా నిలిచేందుకు ఐఆర్సీటీసీ టూర్ మేనేజర్లు యాత్ర పొడవునా ప్రయాణిస్తారు.
భక్తులు ఈ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకుని తమ సీట్లను ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ irctctourism.com ద్వారా ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. ఏవైనా సందేహాలుంటే సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్ నంబర్లు 040-27702407 లేదా 9701360701 ద్వారా అధికారులను సంప్రదించవచ్చు.
ఈ లింక్ పై క్లిక్ చేసి ఈ టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవటంతో పాటు మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

