హైదరాబాద్ టు షిర్డీ, నాసిక్ - బడ్జెట్ ధరలో టూర్ ప్యాకేజీ, ఓ లుక్కేయండి
షిర్డీ సాయి బాబా దర్శనంతో పాటు నాసిక్ వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే హైదరాబాద్ సిటీ నుంచి IRCTC టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చింది. ట్రైన్ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఆ వివరాలపై ఓ లుక్కేయండి…..
ఐఆర్సీటీసీ టూరిజం నుంచి పలు రకాల ప్యాకేజీలు వస్తున్నాయి. వీటిలో అధ్యాత్మికం, పర్యాటకం వంటి ప్రాంతాలుంటున్నాయి. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా దర్శనంతో పాటు నాసిక్ చూసేందుకు ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది.

3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ ప్యాకేజీలో షిర్డీ సాయిబాబా దర్శనం ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్ 5 డిసెంబర్, 2025 తేదీన అందుబాటులో ఉంది. సాయి శివమ్ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.
టూర్ షెడ్యూల్ వివరాలు:
- మొదటి రోజు హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ లో ట్రైన్ నెంబర్ 17064(అజంతా ఎక్స్ ప్రెస్) కలిగిన రైలు ఎక్కాలి. రాత్రంతా జర్నీ ఉంటుంది.
- రెండో రోడు ఉదయం 7.10 గంటలకు నాగర్ సోల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి షిర్డీకి చేరుకుంటారు. ఆ తర్వాత షిర్డీ సాయి బాబా దర్శనం ఉంటుంది. రాత్రి షిర్డీలోనే ఉంటారు.
- మూడో రోజు నాసిక్ చేరుకుంటారు. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత పంచాయవతికి వెళ్తారు. సాయంత్రం 8.30 గంటలకు నాగర్ సోల్ రైల్వే స్టేషన్ నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
- నాల్గో రోజు ఉదయం 09:45 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
టూర్ ప్యాకేజీ ధరలు:
హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే షిర్డీ టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు చూస్తే…. సింగిల్ షేరింగ్ కు రూ. 8,840గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 7470,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 7450గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి.
స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ. 7170, డబుల్ షేరింగ్ కు రూ. 5790, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 5770గా నిర్ణయించారు. ఆసక్తిగలవారు ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.
ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా వివరాలను తెలుసుకోవాలంటే… 04027702407, 9701360701 మొబైల్ నెంబర్లను సంప్రదించవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

