Hyderabad road accident Case : మాదాపూర్ ఇనార్బిట్ మాల్ ఎదుట ఆగస్టు 16న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అతివేగంగా వచ్చిన ఆస్టన్ మార్టిన్ కారు ఢీకొట్టడంతో 26 ఏళ్ల సేల్స్వుమన్ దారుణంగా బలైంది. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చేపట్టిన దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే..?

మృతురాలు భారతి ముఖి ఇనార్బిట్ మాల్లోని ఒక దుకాణంలో సేల్స్వుమన్గా పనిచేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో భారతి తన సహోద్యోగితో కలిసి భోజనం తెచ్చుకోవడానికి ఐటీసీ కోహినూర్ వైపు వెళ్లారు. భోజనం తీసుకుని తిరిగి వస్తూ, మాల్ ముందు భాగంలో రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో, తీవ్ర నిర్లక్ష్యంతో దూసుకొచ్చిన ఒక లగ్జరీ కారు భారతిని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు, సహోద్యోగులు ఆమెను జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునే సరికి ఆమె మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని మాదాపూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేవీ సుబ్బారావు వెల్లడించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ప్రమాదానికి కారణమైన కారును జనసేన పార్టీ రాజ్యసభ ఎంపీ, ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజూష్ (21) నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యాపారవేత్త అయిన సంజూష్ మాదాపూర్లోనే నివాసముంటున్నారు. ఘటన జరిగిన రోజే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రమాద సమయంలో నిందితుడు మద్యం లేదా మత్తు పదార్థాలు ఏమైనా తీసుకున్నాడా అని తెలుసుకునేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ పరీక్షలు నిర్వహించారు. అతని రక్త నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)కి పంపించారు. ప్రమాదానికి కారణమైన ఆస్టన్ మార్టిన్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందని, పోస్ట్మార్టం నివేదిక రావాల్సి ఉందని ఎస్హెచ్ఓ తెలిపారు.
{{/usCountry}}ప్రమాద సమయంలో నిందితుడు మద్యం లేదా మత్తు పదార్థాలు ఏమైనా తీసుకున్నాడా అని తెలుసుకునేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ పరీక్షలు నిర్వహించారు. అతని రక్త నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)కి పంపించారు. ప్రమాదానికి కారణమైన ఆస్టన్ మార్టిన్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందని, పోస్ట్మార్టం నివేదిక రావాల్సి ఉందని ఎస్హెచ్ఓ తెలిపారు.
{{/usCountry}}