జూబ్లీహిల్స్ బై పోల్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు నోటిఫికేషన్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అక్టోబర్ 22వ తేదీ వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 24వ తేదీ దాకా ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. ఉప ఎన్నిక పోలింగ్ వచ్చే నెల 11న ఉంటుంది. 14న కౌంటింగ్ జరిగి ఆ తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు.

షేక్పేట్ తహశీల్దార్ ఆఫీసులో నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మెుత్తం 3.9 లక్షల ఓటర్స్ ఉన్నారు.
సువిధ పోర్టల్ ద్వారా నామినేషన్లు వేయవచ్చు. ఆన్లైన్లో నామినేషన్ పత్రాలు డౌన్లోడ్ చేసుకుని, ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఆన్లైన్ ద్వారా భర్తీ చేసినా.. స్వయంగా అభ్యర్థి హాజరు కావాలి. సంతకం, ప్రమాణం కోసం తప్పనిసరిగా వెళ్లాలి. నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసే సమయంలోపు హాజరు కావాలి.
ఉప ఎన్నికకు గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బీఆర్ఎస్ తన అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థిని నేడో.. రేపో ప్రకటించే అవకాశం ఉంది. ఈ బై పోల్ను మూడు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇక ప్రచారం కూడా ఊపందుకుంటోంది. సీఎం రేవంత్ రెడ్డి ఎలాగైనా జూబ్లీహిల్స్లో గెలవాలని, మెజారిటీ 25 వేలుగా టార్గెట్గా పెట్టుకున్నారు. మరోవైపు కేటీఆర్ కూడా కారు కావాలా బుల్డోజర్ కావాలా అంటూ ప్రచారం చేస్తున్నారు. దీపావళి తర్వాత ప్రచారం మరింత హీట్ ఎక్కనుంది.
ఈ ఏడాది జూన్ 8న భారత రాష్ట్ర సమితి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గం పరిధిలో 3,92,669 ఓటర్లు ఉన్నారు.
{{/usCountry}}ఈ ఏడాది జూన్ 8న భారత రాష్ట్ర సమితి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గం పరిధిలో 3,92,669 ఓటర్లు ఉన్నారు.
{{/usCountry}}2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న రెండో ఉప ఎన్నిక ఇది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత ఫిబ్రవరి 24, 2024న ప్రమాదంలో మరణించిన తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ బైపోల్ వచ్చింది.