తెలంగాణలో మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు మెుదలుకానున్నాయి. అంతకుముందు విద్యార్థులకు పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలపై తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు జరగాల్సిన సమ్మెటివ్ అసెస్మెంట్(ఎస్ఏ-2) పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి.

ఎస్ఏ-2 పరీక్షలు ఈనెల 10 నుంచి 20వరకు జరగాల్సి ఉంది. కానీ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు ఉన్నాయి. ఈ కారణంగా ఎస్ఏ 2 పరీక్షలు అన్ని కూడా రెండు రోజుల ముందు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ ప్రకటించారు.
అంటే నిజానికి ఏప్రిల్ 10వ తేదీన ప్రారంభంకావాల్సిన ఈ పరీక్షలు.. ఈనెల 8న ప్రారంభవుతాయి. ఏప్రిల్ 18వ తేదీతో ముగుస్తాయి. ఒకటో తరగతి నుంచి 7వ తరగతికి సంబంధించిన పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 11.30వరకు జరుగుతాయి. అదే ఎనిమిదో తరగతి పరీక్షలు 9 గంటల నుంచి 11.45వరకు ఉంటాయి. ఇక 9వ తరగతి పరీక్షలు 9 గంటల నుంచి 12 వరకు జరగనున్నాయి.
వేసవి సెలవులు
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు అధికారికంగా వేసవి సెలవులను ప్రకటించింది. దీంతో విద్యార్థులకు ఏప్రిల్ 24 నుంచి 2026 జూన్ 11 వరకు 48 రోజుల సమ్మర్ హాలిడేస్ లభించనున్నాయి. అధికారిక ప్రకటన ప్రకారం, 2026–27 విద్యా సంవత్సరానికి పాఠశాలలు 2026 జూన్ 12న తిరిగి తెరుస్తారు. సిలబస్ను సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైతే విద్యా సంస్థలు వారానికి అదనపు తరగతులను నిర్వహించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణ పాఠశాల విద్యాశాఖ, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు మార్చి 15 నుండి ఏప్రిల్ 23, 2026 వరకు హాఫ్ డే విధానాన్ని ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ-సహాయక, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పనిచేస్తాయి. విద్యాశాఖ సంచాలకులు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, మధ్యాహ్న భోజనాన్ని 12:30 గంటలకు సిద్ధం చేయాల్సి ఉంటుంది.
{{/usCountry}}తెలంగాణ పాఠశాల విద్యాశాఖ, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు మార్చి 15 నుండి ఏప్రిల్ 23, 2026 వరకు హాఫ్ డే విధానాన్ని ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ-సహాయక, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పనిచేస్తాయి. విద్యాశాఖ సంచాలకులు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, మధ్యాహ్న భోజనాన్ని 12:30 గంటలకు సిద్ధం చేయాల్సి ఉంటుంది.
{{/usCountry}}కొన్ని పాఠశాలలు ఎస్ఎస్సీ పరీక్షా కేంద్రాలుగా ఉన్నాయి. అటువంటి పాఠశాలలు పరీక్షలు జరిగే రోజుల్లో మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు, మిగిలిన రోజుల్లో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పనిచేస్తున్నాయి. పదో తరగతి విద్యార్థుల కోసం నిర్వహించే ప్రత్యేక తరగతులు యథావిథిగా కొనసాగుతాయి.