...
...
Next Story

MMTS : హైదరాబాద్‌-యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్‌, కొమురవెల్లి రైల్వేస్టేషన్‌పై కీలక అప్డేట్!

MMTS : హైదరాబాద్‌-యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. కొమురవెల్లి రైల్వే స్టేషన్‌పై మాట్లాడారు.

Published on: Apr 11, 2026, 10:50:47 IST
Advertisement

హైదరాబాద్‌ను యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రంతో అనుసంధానించే ఎంఎంటీఎస్ సేవల రెండో దశకు రూ.500 కోట్ల కేటాయింపును కేంద్రం పరిశీలిస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రకటించారు. మల్లన్న స్వామి ఆలయం సమీపంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నారని తెలిపారు.

హైదరాబాద్‌-యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్‌
హైదరాబాద్‌-యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్‌

హైదరాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం విలేకరులతో కిషన్ రెడ్డి మాట్లాడారు. కొమురవెల్లి.. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి జిల్లా, ఇతర తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సురక్షితమైన, సరసమైన ప్రవేశాన్ని కల్పిస్తూ వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని కిషన్ రెడ్డి అన్నారు.

నగరంలో కొత్త కేంద్ర సంస్థల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందించాలని కిషన్ రెడ్డి కోరారు. అలాగే రవాణా శాఖ సహకారంతో అత్యాధునిక ఆడిటోరియం నిర్మించే ప్రణాళికలను వెల్లడించారు. ఇందుకోసం స్థల సందర్శన జరగనుందన్నారు.

హైదరాబాద్ వేగంగా ఒక కీలక వ్యూహాత్మక మెట్రో నగరంగా అభివృద్ధి చెందుతోందని కిషన్ రెడ్డి అన్నారు. శాస్త్రీయ విద్య, పరిశోధన, ఐటీకి కేంద్రంగా నగరానికి ఉన్న సుస్థిర పాత్రను మరింత పటిష్టం చేస్తూ, రాబోయే జాతీయ విజ్ఞాన కేంద్రం తదుపరి పరిశోధనలకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని నొక్కి చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, స్మార్ట్ క్లాసులు, డిజిటల్ తరగతి గదులతో సహా పలు సౌకర్యాలను కేంద్రం బలోపేతం చేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోని ప్రతి పాఠశాలకు ఇవి అందాలని అన్నారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో డయాలసిస్ కేంద్రాలు, టీకా కార్యక్రమాలు, ప్రజారోగ్య పరిరక్షణ కోసం నగరంలోని ఆసుపత్రులకు పరికరాలు అందుతున్నాయన్నారు. వీటి సమర్థవంతమైన అమలు కోసం పటిష్టమైన పర్యవేక్షణ అవసరమని కిషన్ రెడ్డి నొక్కి చెప్పారు.

'లబ్ధిదారుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, కేంద్ర పథకాలను సమయానుకూలంగా, సమర్థవంతంగా అమలు చేయడానికి శాఖల మధ్య మెరుగైన సమన్వయం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించాను. ప్రాజెక్టుల అమలుకు అవసరమైన అన్ని రకాల మద్దతు అందిస్తామని హామీ ఇచ్చాను. ఈ సమావేశంలో పాల్గొని సూచనలు ఇచ్చిన గౌరవ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.' అని కిషన్ రెడ్డి అన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe