ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఆరేళ్ల యూకేజీ విద్యార్థి పెన్సిల్ గుచ్చుకుని మరణించాడు. ఈ ఘటనలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. రోజూలాగే విహార్ అనే విద్యార్థి జేబులో పెన్సిల్ పెట్టుకున్నాడు. కానీ అదే అతడి ప్రాణాలు తీసింది. పూర్తి వివరాళ్లోకి వెళ్తే..

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో విహార్ యూకేజీ చదువుతున్నాడు. రోజూలాగే పాఠశాలకు తాను రాసుకునే పెన్సిల్ తీసుకెళ్లాడు. చొక్కా జేబులో పెట్టుకున్నాడు. బాలుడు మధ్యాహ్నం విరామ సమయంలో టాయిలెట్ వెళ్లాడు. తర్వాత తన తరగతి గదికి తిరిగి పరిగెడుతుండగా.. జారి కిందపడిపోయాడు.
అదే సమయంలో జేబులో ఉన్న పెన్సిల్ ప్రమాదవశాత్తు విహార్ గొంతులో గుచ్చుకుంది. దీని వలన తీవ్ర రక్తస్రావం జరిగింది. పాఠశాల సిబ్బంది, చుట్టుపక్కలవారు వెంటనే విహార్ను 108 అత్యవసర వాహనం ద్వారా కుసుమంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఈ ఆకస్మిక మరణం విహార్ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. కళ్ల ముందే తిరిగిన బాబు కనిపించని లోకాలకు వెళ్లడంపై తల్లిదండ్రులు, బంధువులను ఓదార్చలేని స్థితి నెలకొంది. నాయకన్ గూడెం గ్రామం మొత్తం దుఃఖంలో మునిగిపోయింది.
చలాన్ లింక్తో 6 లక్షలు మాయం
ఓ వ్యక్తి తన ఫోన్కు టెక్స్ట్ మెసేజ్ ద్వారా వచ్చిన ట్రాఫిక్ చలాన్ లింక్ను ఓపెన్ చేశాడు. రూ.500 జరిమానా చెల్లించడానికి ప్రయత్నించి సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.6 లక్షలు పోగొట్టుకున్నాడని హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించాడు. నిజానికి బాధితుడికి ట్రాఫిక్ ఉల్లంఘన చేశారని వాహనంపై రూ. 500 జరిమానా విధించినట్లు సందేశం వచ్చింది. ఆ సందేశంలో ఒక లింక్ ఉంది. దాన్ని బాధితుడు క్లిక్ చేయగానే చలాన్ చెల్లించమని ఒక వెబ్సైట్కు వెళ్లింది లింక్. అయితే అది కూడా పోలీస్ అధికారిక పోర్టల్లాగే ఉంది. బాధితుడు నిజమేనని నమ్మేశాడు.
బాధితుడు కొన్ని అంకెలను టైప్ చేయడం ద్వారా చలాన్ మొత్తాన్ని చెల్లించడానికి ప్రయత్నించాడు. దీంతో దాదాపు రూ. 6 లక్షలు పోగొట్టుకున్నాడు. మోసగాళ్ళు అతని ఫోన్ను హ్యాక్ చేసి అనధికార లావాదేవీలు జరిపారు అని సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఇలాంటి మోసాలకు బలైపోవద్దని, చలాన్లు చెల్లించమని అడుగుతూ టెక్స్ట్ సందేశం, ఇమెయిల్లు లేదా వాట్సాప్ ద్వారా వచ్చే సందేశాలను నమ్మవద్దని కోరారు. సైబర్ మోసాలకు గురైతే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
{{/usCountry}}బాధితుడు కొన్ని అంకెలను టైప్ చేయడం ద్వారా చలాన్ మొత్తాన్ని చెల్లించడానికి ప్రయత్నించాడు. దీంతో దాదాపు రూ. 6 లక్షలు పోగొట్టుకున్నాడు. మోసగాళ్ళు అతని ఫోన్ను హ్యాక్ చేసి అనధికార లావాదేవీలు జరిపారు అని సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఇలాంటి మోసాలకు బలైపోవద్దని, చలాన్లు చెల్లించమని అడుగుతూ టెక్స్ట్ సందేశం, ఇమెయిల్లు లేదా వాట్సాప్ ద్వారా వచ్చే సందేశాలను నమ్మవద్దని కోరారు. సైబర్ మోసాలకు గురైతే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
{{/usCountry}}