ప్రతిష్టాత్మక 'ఖేలో ఇండియా యూత్ గేమ్స్' (KIYG) 2026 ఎడిషన్కు మన తెలంగాణ వేదిక కానుంది. ఈ మేరకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఎనిమిదో విడతగా వస్తున్న ఈ జాతీయ స్థాయి క్రీడా సంబరాలు ఈ ఏడాది నవంబర్ నెలలో జరగనున్నాయి.
మూడేళ్ల వ్యవధిలో ఈ మెగా ఈవెంట్ను నిర్వహిస్తున్న రెండో దక్షిణాది రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. గతంలో 2024 ఎడిషన్కు తమిళనాడు ఆతిథ్యమివ్వగా, మొన్నటి 2025 మే నెలలో జరిగిన ఏడో విడత పోటీలను బీహార్ విజయవంతంగా నిర్వహించింది.
దేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రధాన జాతీయ ఈవెంట్లను విస్తరించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనల మేరకు, ఈ అద్భుతమైన అవకాశాన్ని తెలంగాణకు కేటాయించడం ఎంతో సముచితమని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) విడుదల చేసిన అధికారిక ప్రకటనలో మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు.
"ఇలాంటి భారీ క్రీడా పండుగను నిర్వహించడానికి అవసరమైన అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, అద్భుతమైన క్రీడా ఉత్సాహం తెలంగాణలో మెండుగా ఉన్నాయి. ఈ మెగా టోర్నమెంట్లో దేశవ్యాప్తంగా కనీసం 8,000 మంది యువ అథ్లెట్లు, అధికారులు, సహాయక సిబ్బంది పాల్గొంటారని అంచనా వేస్తున్నాం," అని మంత్రి వివరించారు. ఈ క్రీడల ద్వారా భారతదేశపు యువశక్తి (యువ శక్తి) ప్రపంచ స్థాయికి ఎదిగేందుకు మరో గొప్ప వేదిక లభించిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఆసియా గేమ్స్ జోష్లో అథ్లెట్లు
జపాన్లో జరిగే ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్ ముగిసిన వెంటనే ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ప్రారంభం కానుండటం విశేషం. దీనివల్ల మన అథ్లెట్లు ఇప్పటికే అత్యుత్తమ ఫామ్లో ఉంటారని….. ఈసారి జాతీయ రికార్డుల వేట సాగుతుందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో జరిగే ఈ పోటీలు అటు క్రీడాకారులకు, ఇటు అభిమానులకు ఒక పెద్ద పండుగలా మారుతాయని, ఎదుగుతున్న యువ అథ్లెట్లు తమ క్రీడా రంగ హీరోలను నేరుగా చూసి స్ఫూర్తి పొందేందుకు ఇది గొప్ప అవకాశమని మంత్రి మాండవీయ ఆశాభావం వ్యక్తం చేశారు.
గత రికార్డులు ఇలా….
{{/usCountry}}జపాన్లో జరిగే ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్ ముగిసిన వెంటనే ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ప్రారంభం కానుండటం విశేషం. దీనివల్ల మన అథ్లెట్లు ఇప్పటికే అత్యుత్తమ ఫామ్లో ఉంటారని….. ఈసారి జాతీయ రికార్డుల వేట సాగుతుందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో జరిగే ఈ పోటీలు అటు క్రీడాకారులకు, ఇటు అభిమానులకు ఒక పెద్ద పండుగలా మారుతాయని, ఎదుగుతున్న యువ అథ్లెట్లు తమ క్రీడా రంగ హీరోలను నేరుగా చూసి స్ఫూర్తి పొందేందుకు ఇది గొప్ప అవకాశమని మంత్రి మాండవీయ ఆశాభావం వ్యక్తం చేశారు.
గత రికార్డులు ఇలా….
{{/usCountry}}గతేడాది 2025లో బీహార్ వేదికగా జరిగిన ఖేలో ఇండియా పోటీల్లో మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచి ఛాంపియన్లుగా అవతరించాయి. ఆ టోర్నీలో ఆతిథ్య బీహార్ 15వ స్థానంతో సరిపెట్టుకోగా, మన తెలంగాణ జట్టు పతకాల పట్టికలో 13వ స్థానాన్ని దక్కించుకుంది. అంతకుముందు 2024లో తమిళనాడులో జరిగిన పోటీలలో మాత్రం తెలంగాణ జట్టు అద్భుత ప్రదర్శనతో 6వ స్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆ ఏడాది తమిళనాడు రెండో స్థానాన్ని, మహారాష్ట్ర ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. బీహార్లో జరిగిన గత ఎడిషన్లో మొత్తం 28 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. అందులో 27 విభాగాల్లో పతకాలను అందించగా, సరికొత్త ట్రెండ్కు అనుగుణంగా ఈ- స్పోర్ట్స్ (e-sports) విభాగంగాను ప్రదర్శన పోటీగా తొలిసారి పరిచయం చేశారు. 2025 గేమ్స్లో మొత్తంగా 26 కొత్త రికార్డులు నమోదవగా, వాటిలో 13 జాతీయ యువ రికార్డులు ఒక్క వెయిట్లిఫ్టింగ్ విభాగంలోనే రావడం విశేషం. మిగిలినవన్నీ అథ్లెటిక్స్ విభాగంలో సరికొత్త మీట్ రికార్డులుగా నమోదయ్యాయి. ఇప్పుడు సొంత గడ్డపై జరుగుతున్న పోటీలు కావడంతో, తెలంగాణ క్రీడాకారులు మరింత మెరుగైన ప్రదర్శనతో పతకాల పంట పండిస్తారని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు.