సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా న్యూజిలాండ్కు చెందిన మావోరీ గిరిజన తెగకు చెందినవారు ములుగు జిల్లాలోని మేడారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మావోరీ తెగ బృందం వారి సాంప్రదాయ హాకా నృత్యాన్ని ప్రదర్శించింది. ఇది యుద్ధానికి వెళ్ళే ముందు గిరిజన యోధులను ప్రేరేపించడానికి సాంప్రదాయకంగా ఉపయోగించే శక్తివంతమైన ఆచార ప్రదర్శన అని చెబుతున్నారు.

అధికారుల ప్రకారం, న్యూజిలాండ్ నుండి గిరిజన తెగకు చెందినవారు రావడం వలన అంతర్జాతీయ గిరిజన సాంస్కృతిక విషయాలు తెలుస్తాయని, ఇక్కడి విషయాలు వారికి తెలుస్తాయని పేర్కొన్నారు. మేడారం జాతర సందర్శన సందర్భంగా మావోరీ తెగ బృందం వారి సాంప్రదాయ హాకా నృత్యాన్ని ప్రదర్శించింది..
మావోరీ కళాకారులతో కలిసి నృత్యం చేశారు మంత్రి సీతక్క. వారిని ప్రోత్సహించారు. మావోరీ తెగ ప్రతినిధి బృందాన్ని అంతకుముందు హృదయపూర్వకంగా స్వాగతించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గిరిజన సంస్కృతి సార్వత్రికమైనదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గిరిజన సమాజాలు ప్రకృతి, అడవులతో లోతైన బంధాన్ని పంచుకుంటాయని అన్నారు.
ఇటువంటి చర్యలు ప్రపంచవ్యాప్తంగా స్థానిక సమాజాల మధ్య పరస్పర అవగాహన, గౌరవాన్ని బలపరుస్తాయని మంత్రి సీతక్క అన్నారు. తరువాత మావోరీ ప్రతినిధి బృందాన్ని మేడారంలోని గిరిజన దేవతల దర్శనం కోసం తీసుకెళ్లారు. గిరిజన సంప్రదాయాలు, సంస్కృతిలో సమ్మక్క-సారలమ్మ ప్రాముఖ్యతను మంత్రి వివరించారు. సందర్శించిన అతిథులను సత్కరించారు.
సమ్మక్క-సారలమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఇది జనవరి 28 నుండి 31 వరకు జరగనుంది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల నుండి భక్తులు పాల్గొంటారు.
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తన ప్రసంగంలో మేడారం జాతర గురించి ప్రస్తావించడం విశేషం. రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం మహా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యతనిచ్చిందని చెప్పారు. గతంలో చేసిన తాత్కాలిక ఏర్పాట్లకు భిన్నంగా, గిరిజన ఆచారాలను గౌరవిస్తూ శాశ్వత మౌలిక సదుపాయాల కోసం రూ.251 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. జాతరలో రెండు కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
{{/usCountry}}77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తన ప్రసంగంలో మేడారం జాతర గురించి ప్రస్తావించడం విశేషం. రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం మహా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యతనిచ్చిందని చెప్పారు. గతంలో చేసిన తాత్కాలిక ఏర్పాట్లకు భిన్నంగా, గిరిజన ఆచారాలను గౌరవిస్తూ శాశ్వత మౌలిక సదుపాయాల కోసం రూ.251 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. జాతరలో రెండు కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
{{/usCountry}}