తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు - ఈ జిల్లాలకు కొత్త కలెక్టర్లు
తెలంగాణలో భారీగా ఐఏఎస్ బదిలీలు జరిగాయి. మొత్తం 33 మంది ఐఏఎస్ లకు స్థానచలనం కల్పించారు. అంతేకాకుండా మరో ముగ్గురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న నవీన్ మిట్టల్ ను బదిలీ చేసింది. ఆయనకు… ఇందన శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను అప్పగించింది. ఈ స్థానంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న లోకేశ్ కుమార్ ను రెవెన్యూ కార్యదర్శిగా నియమించింది. అంతేకాకుండా సీసీఎల్ఏ బాధ్యతలను కూడా అప్పగించింది. ఈ బదిలీల్లో భాగంగా… పలు జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం మార్చింది.

బదిలీల వివరాలు:
- హైదరాబాద్ కలెక్టర్గా హరిచందన దాసరి
- ఖమ్మం జిల్లా కలెక్టర్ గా అనుదీప్.
- హన్మకొండ కలెక్టర్గా స్నేహ శబరీష్.
- నిజామాబాద్ కలెక్టర్గా వినయ్ కృష్ణా రెడ్డి.
- తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఎండీగా జే శంకరయ్య.
- ఆర్ అండ్ ఆర్ కమిషనర్గా శివకుమార్ నాయుడు.
- రిజిస్ట్రేషన్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఆర్ హనుమంతు నియమాకం.
- సమాచార కమిషన్ సెక్రటరీగా లక్పతి నాయక్.
- పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా నవీన్ నికోలస్.
- టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా వల్లూరి క్రాంతి.
- హ్యూమన్ రైట్స్ కమిషనర్ సెక్రటరీగా నిర్మల క్రాంతి వెస్లీ.
- ఇండస్ట్రీస్ డైరెక్టర్గా నిఖిల్ చక్రవర్తి.
- సాధారణ పరిపాలన విభాగం సంయుక్త కార్యదర్శిగా చిట్టెం లక్ష్మి.
- స్త్రీ,శిశు సంక్షేమ డైరెక్టర్గా శ్రీజన.
- ఆరోగ్యశ్రీ సీఈవోగా ఉదయ్ కుమార్.
- ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్గా చెక్క ప్రియాంక బదిలీ
- తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా ప్రియాంకా ఆల.
- వ్యవసాయ సహకారశాఖ సంయుక్త కార్యదర్శిగా ఎల్ శివశంకర్ (విపత్తు నిర్వహణ అదనపు బాధ్యతలు).
- గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శిగా వీపీ గౌతమ్ (అదనపు బాధ్యతలు), సింగరేణి డైరెక్టర్గా పీ గౌతమ్.
- మత్స్యశాఖ డైరెక్టర్గా నిఖిల.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper


