భారీగా ఐపీఎస్ల బదిలీలు - పలు జిల్లాలకు కొత్త ఎస్పీలు
రాష్ట్రంలో భారీగా ఐపీఎస్లు బదిలీ అయ్యారు. 32 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలు జిల్లాలకు కొత్త ఎస్పీలు నియమితులయ్యారు.
రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఐడీ కొత్త డీజీగా పరిమళన్ నూతన్ నియమితులు కాగా… పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా చేతన్, మహేశ్వరం డీసీపీగా నారాయణరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పలు జిల్లాలకు కొత్త ఎస్పీలు కూడా వచ్చారు.

పలు జిల్లాలకు కొత్త ఎస్పీలు….
ఈ బదిలీల్లో భాగంగా ములుగు జిల్లా ఎస్పీగా కేకన్ సుధీర్ రామ్నాథ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీగా సంకీర్త్,నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీగా సంగ్రామ్ పాటిల్,మహబూబాబాద్ ఎస్పీగా శబరీష్,వనపర్తి ఎస్పీగా సునీత,వికారాబాద్ జిల్లా ఎస్పీగా స్నేహ మిశ్ర నియమితులయ్యారు.
గవర్నర్ ఏడీసీగా పాటిల్ కాంతిలాల్ సుభాష్, పెద్దపల్లి డీసీపీగా రామ్ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్ ఎస్పీగా అవినాష్ కుమార్, భువనగిరి అడిషనల్ ఎస్పీగా కంకణాల రాహుల్ రెడ్డి, జగిత్యాల అడిషన్ ఎస్పీగా శేషాద్రిని రెడ్డి, ములుగు అడిషనల్ ఎస్పీగా శివం ఉపాధ్యాయ, ఆదిలాబాద్ అదనపు ఎస్పీగా మౌనిక భాద్యతలు చూడనున్నాయి.
ఇక ఏటూరు నాగారం ఏఎస్పీగా మనన్ భట్, నిర్మల్ ఏఎస్పీగా సాయికిరణ్, వేములవాడు ఏఎస్పీగా రుత్విక్ సాయి, సత్తుపల్లి ఏసీపీగా యాదవ్ వసుంధర, టీజీ ట్రాన్స్కో ఎస్పీగా శ్రీనివాస్ నియమితలుయ్యారు.
హైదరాబాద్ టాస్క్ఫోర్స్ ఎస్పీగా వైభవ్ గైక్వాడ్, సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ కారే, మల్కాజ్ గిరి డీసీపీగా శ్రీధర్ ను నియమించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

