OU Distance Education : ఓయూ దూర విద్యలో ఎంబీఏ, ఎంసీఏ అడ్మిషన్లు - ఇలా దరఖాస్తు చేసుకోండి
ఓయూ దూర విద్యలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈనెల 18వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 22వ తేదీన ఎగ్జామ్ నిర్వహిస్తారు.
ట్ఉస్మానియా యూనివర్శిటీ దూర విద్యలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2025 - 2026 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలు కల్పించనున్నారు. రెండేళ్లపాటు కోర్సు వ్యవధి ఉంటుంది.

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం…
ఈ ప్రవేశాల కోసం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 18వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. రూ. 500 ఆలస్య రుసుంతో ఫిబ్రవరి 21వ తేదీ వరకు అవకాశం కల్పించారు.
ఇందుకు సంబంధించిన రాత పరీక్ష ఫిబ్రవరి 22వ తేదీన నిర్వహిస్తారు. గతేడాది నిర్వహించిన తెలంగాణ ఐసెట్ ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రం నేరుగా అడ్మిషన్లు కల్పిస్తారు. వీరు ప్రత్యేకంగా ఎంట్రెన్స్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు అప్లయ్ చేసుకునే అభ్యర్థులు… డిగ్రీ పాసై ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు… డిగ్రీలో మ్యాథ్స్ సబ్జెక్ట్ చదివి ఉండాలి.
ఎంట్రెన్స్ ఎగ్జామ్ మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. గంటన్నర సమయం ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. 900 చెల్లించాలి. http://www.oucde.net/ వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ప్రాసెస్ ఇలా….
- ముందుగా www.ouadmissions.com వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- నిర్ణయించిన రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. దీంతో రిజిస్ట్రేషన్ ఐడీ జనరేట్ అవుతుంది.
- రిజిస్ట్రేషన్ ఐడీ వివరాలతో లాగిన్ అయ్యాక అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
- అభ్యర్థి ఫొటో, సంతకం అప్లోడ్ చేయాలి.
- అభ్యర్థి వివరాలను కూడా ఎంట్రీ చేసి చివరగా సబ్మిట్ చేయాలి.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫారమ్ కాపీని పొందవచ్చు.

E-Paper












