ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర హుండీ లెక్కింపు ప్రక్రియ బుధవారంతో ముగిసింది. ఈ నెల 5వ తేదీ నుంచి హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో లెక్కింపు ప్రక్రియను కొనసాగించారు. మొత్తం 828 హుండీలను తెరిచి నగదు, ఆభరణాలను లెక్కించారు.
ఈసారి ఆదాయం ఎంతంటే..?

వారం రోజుల పాటు సుమారు 400 మంది సిబ్బంది దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మేడారం హుండీలను లెక్కింపను పూర్తి చేశారు. ఈసారి మొత్తం రూ.13,25,83,269 ఆదాయం వచ్చినట్లు దేవదాయశాఖ అధికారులు వెల్లడించారు. హుండీల్లో నగదుతో పాటు విదేశీ కరెన్సీ, రద్దు నోట్లు, బంగారం, వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి.
గత మహా జాతరలో 540 హుండీలను మాత్రమే ఏర్పాటు చేశారు. దీని ద్వారా రూ.13.25 కోట్ల ఆదాయం వచ్చింది. కానీ ఈసారి 828 హుండీలు ఏర్పాటు చేసినప్పటికీ దాదాపు సమాన స్థాయిలోనే ఆదాయం వచ్చింది. హుండీల సంఖ్యను పెంచినప్పటికీ… ఆదాయం పెరుగుదల పరిమితంగానే ఉంది. ఇక హుండీల్లో వచ్చిన నగదు, ఆభరణాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం బ్యాంకుల్లో జమ చేయనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు ప్రకటించారు.
సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు వచ్చే భక్తుల సంఖ్య నిత్యం పెరుగుతూ వస్తోంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ మహా జాతరకు అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. 2018లో రూ. 8.14 కోట్ల ఆదాయం రాగా… 2020లో రూ. 9.87 కోట్లు, 2022లో రూ. 12.45 కోట్ల ఆదాయం వచ్చింది.
గతంతో పోల్చితే ఈసారి మరింత ఎక్కువ ఆదాయం రావొచ్చని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మేడారంలో అభివృద్ధి పనులను కూడా చేపట్టింది. ఈసారి భక్తులు ఎక్కువగా వస్తారని… ఆదాయం కూడా పెరుగొచ్చని భావించారు. కానీ దాదాపుగా 2024లో వచ్చిన ఆదాయం మాదిరిగానే ఈసారి కూడా కానుకులు వచ్చాయి.
{{/usCountry}}గతంతో పోల్చితే ఈసారి మరింత ఎక్కువ ఆదాయం రావొచ్చని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మేడారంలో అభివృద్ధి పనులను కూడా చేపట్టింది. ఈసారి భక్తులు ఎక్కువగా వస్తారని… ఆదాయం కూడా పెరుగొచ్చని భావించారు. కానీ దాదాపుగా 2024లో వచ్చిన ఆదాయం మాదిరిగానే ఈసారి కూడా కానుకులు వచ్చాయి.
{{/usCountry}}మేడారంలో గద్దెల విస్తరణ చేపట్టడంతో… మేడారం రూపురేఖలు మారిపోయాయి. శాశ్వత ప్రతిపాదికన రోడ్ల నిర్మాణంతో పాటు మరికొన్ని పనులు చేపట్టారు. ఫలితంగా గతంతో పోల్చితే మేడారంలో చాలా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం కూడా కొన్ని అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కూడా ఆదివారం లేదా సెలవు దినాల్లో వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది.