మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం - 10 రోజులు పట్టే ఛాన్స్..!
మేడారం జాతర ముగిసిన నేపథ్యంలో హుండీ లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 788 హుండీలలోని కానుకలు లెక్కిస్తారు.సుమారు 10 రోజుల పాటు లెక్కింపు జరిగే అవకాశం ఉంది.
మేడారం సమ్మక్క - సారక్క జాతర ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో దేవదాయశాఖ హుండీ లెక్కింపు ప్రక్రియను చేపట్టింది. ఇందుకోసం హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాట్లు చేసింది. ఈ లెక్కింపును రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం ప్రారంభించారు.

10 రోజులపాటు లెక్కింపు…!
దేవాదాయ శాఖ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు మొత్తం 500 మంది ఆధ్వర్యంలో లెక్కింపు చేపడుతున్నారు. మొత్తం 788 హుండీలలోని కానుకలు లెక్కిస్తారు. గత జాతరలో 540 హుండీలు పెట్టగా 13.25 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ధపా అంతకన్నా ఎక్కువగా వస్తుందని అంచనా వేస్తున్నారు. లెక్కింపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. సుమారు 10 రోజుల పాటు జరిగే అవకాశం ఉందని దేవదాయ అధికారులు తెలిపారు.
సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు వచ్చే భక్తుల సంఖ్య నిత్యం పెరుగుతూ వస్తోంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ మహా జాతరకు అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. 2018లో రూ. 8.14 కోట్ల ఆదాయం రాగా… 2020లో రూ. 9.87 కోట్లు, 2022లో రూ. 12.45 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. 2024 జాతరలో రూ.13 కోట్ల మేర ఆదాయం రాగా.. ఈసారి మరింత ఎక్కువగా రావొచ్చని అంచనా వేస్తున్నారు.
మరోవైపు ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా గద్దెల విస్తరణ చేపట్టడంతో… మేడారం రూపురేఖలు మారిపోయాయి. శాశ్వత ప్రతిపాదికన రోడ్ల నిర్మాణంతో పాటు మరికొన్ని పనులు చేపట్టారు. ఫలితంగా గతంతో పోల్చితే మేడారంలో చాలా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.
జనవరి 28 నుంచి జనవరి 31 వరకు మహాజాతర అత్యంత వైభవంగా జరిగింది. మేడారం మహాజాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తుల తాకిడి భారీ సంఖ్యలో పెరిగింది. అయితే జాతర ముగిసిన తర్వాత కూడా… భక్తులు తరలివస్తూ దర్శనం చేసుకుంటున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

