...
...
Next Story

మేడారం మహా జాతరలో కీలక ఘట్టం.. నేడు గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు

మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వనదేవతలను దర్శించుకుంటున్నారు. నేడు(జనవరి 28)న మేడారంలో కీలక ఘట్టం ఆవిష్కృతంకానుంది.

Published on: Jan 28, 2026, 05:15:26 IST
Advertisement

జనవరి 28 నుండి 31 వరకు ములుగు జిల్లాలోని మేడారంలో సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు సర్వం సిద్ధమైంది. గిరిజన దేవతలు సమ్మక్క -సారలమ్మల మహా జాతరకు తెలంగాణ, పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌తోటాపుగా ఇతర రాష్ట్రాల నుండి మెుత్తం కలుపుకొని మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. ప్రపంచంలోని జరిగే అతిపెద్ద గిరిజన జాతర ఇది.

మేడారం మహాజాతర
మేడారం మహాజాతర

జనవరి 28న సాయంత్రం గిరిజన పూజారులు సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను గద్దెలపైకి ప్రతిష్ఠించడంతో మహా జాతరలో కీలకఘట్టం ప్రారంభమవుతుంది. జనవరి 29న సాయంత్రం దాదాపు అదే సమయంలో సమ్మక్క చిలకలగుట్టను నుంచి తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. ఈ సమయం మేడారంలో భక్తులు ఊగిపోతుంటారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవానికి ఆరు నెలల క్రితమే సన్నాహాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 19న పునర్నిర్మించిన ప్రాంగణాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ .101 కోట్లతో గిరిజనుల ఆరాధ్యదైవమైన సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజుల గద్దెలు పునర్నిర్మించింది .

2026 మహా జాతరను సందర్శించే భక్తుల సౌలభ్యం కోసం రూ. 150 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టింది. ఈ ఉత్సవ నిర్వహణలో 21 ప్రభుత్వ విభాగాలు, దాదాపు 42,000 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. భక్తుల రాక, నిష్క్రమణ, ప్రాథమిక సౌకర్యాల ఏర్పాటు, భద్రత, పరిశుభ్రత, వైద్య సౌకర్యాలు సరిగా అందేలా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.

ఈ పండుగ కోసం తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ 4,000 బస్సులను నడుపుతోంది. మెుత్తం 51 వేల ట్రిప్పులను ప్లాన్ చేసింది. ఈ మహా జాతర కోసం 5,000 మందికి పైగా ఆరోగ్య సిబ్బంది, ప్రభుత్వ అంబులెన్స్‌లు, 40 బైక్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు.

ఈ పండుగలో ప్లాస్టిక్ వాడకాన్ని నివారించడానికి, పర్యావరణ అనుకూల చర్యలను అనుసరించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. జంపన్నవాగు వద్ద స్నానాల కోసం ఏర్పాట్లు చేసింది. జంపన్నవాగులో సరిపడా నీరు ప్రవహిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe