...
...
Next Story

మేడ్చల్ లో ఉగ్రవాద అనుమానితుడు అరెస్ట్ - వెలుగులోకి కీలక విషయాలు

మేడ్చల్‌లోని ఓ హోటల్ లో పని చేస్తున్న కార్మికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ ఐఎస్‌ఐ మద్దతు ఉన్న ఉగ్రవాద ముఠాతో సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు.

Published on: May 25, 2026, 07:29:47 IST
Advertisement

ISI Connection in Medchal : మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో కలకలం రేగింది. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ (ISI) మద్దతు ఉన్న ఒక ఉగ్రవాద ముఠాతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముబారక్ హోటల్‌లో పనిచేస్తున్న ఆ కార్మికుడిని నిఘా వర్గాల పక్కా సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మేడ్చల్ లో హోటల్ కార్మికుడి అరెస్ట్ (image source istock)
మేడ్చల్ లో హోటల్ కార్మికుడి అరెస్ట్ (image source istock)

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్ట్ అయిన నిందితుడిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘాజియాబాద్‌కు చెందిన జాయేద్ ఖాన్‌గా గుర్తించారు. అతను మేడ్చల్‌లోని ముబారక్ హోటల్‌లో మాస్టర్ లేదా సర్వర్‌గా పనిచేస్తున్నాడు. పాకిస్తాన్ ఐఎస్‌ఐ బ్యాకింగ్ ఉన్న ఒక నిషేధిత గ్రూపులో చేరాలనే తీవ్ర ఆసక్తితో జాయేద్ ఖాన్ ఉన్నట్లు విచారణలో తేలింది. ఇందుకోసం అతను తన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఖాతా ద్వారా సదరు ముఠా సభ్యులను సంప్రదించడానికి పలుమార్లు ప్రయత్నించాడు.

నకిలీ పిస్తోళ్లు స్వాధీనం

ముబారక్ హోటల్‌పై దాడి చేసిన సమయంలో నిందితుడి నుంచి అతని మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్‌ను క్షుణ్ణంగా పరిశీలించగా.. అనుమానిత గ్రూపులతో అతను జరిపిన చాటింగ్‌లు, స్క్రీన్‌షాట్‌లు, కాల్ రికార్డులు లభ్యమయ్యాయి. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన కీలక సాక్ష్యాలుగా వీటిని పోలీసులు పరిగణిస్తున్నారు. అంతేకాకుండా, నిందితుడి వద్ద నుంచి రెండు నకిలీ పిస్తోళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ వ్యవహారంపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని న్యాయమూర్తి ముందు హాజరుపరచగా, కోర్టు అతనికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అతడిని జైలుకు తరలించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe