తెలంగాణలో పేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం అందిస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంక్షేమ పథకాల అమలుపై హైకోర్టు మధ్యంతర స్టే విధించిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ పథకాలపై విధించిన స్టేను తొలగించేందుకు త్వరలోనే హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించనున్నట్లు స్పష్టం చేసింది. గత ప్రభుత్వం తెచ్చిన లోపభూయిష్టమైన ఉత్తర్వుల వల్లే ప్రస్తుత న్యాయపరమైన చిక్కులు తలెత్తాయని, త్వరలోనే అన్ని పొరపాట్లను సరిదిద్ది పథకాలను కొనసాగిస్తామని ప్రకటించింది.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించి గతంలో జారీ చేసిన 8 జీవోలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ (W.P. No. 21732/2026)పై విచారణ జరిపిన హైకోర్టు, 12.08.2026న మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. 09.09.2026 వరకు ఈ పథకాలపై స్టే విధిస్తున్నట్లు పేర్కొంది. న్యాయస్థానం ఆదేశాలను గౌరవిస్తూనే, పేద ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సమగ్ర కౌంటర్ అఫిడవిట్ ద్వారా ఈ పథకాల రాజ్యాంగబద్ధతను, అవసరాన్ని కోర్టుకు వివరిస్తామని ప్రభుత్వం తెలిపింది.
2014లో పథకాన్ని ప్రారంభించిన సమయంలో అప్పటి ప్రభుత్వం సరైన నిబంధనలతో జీవోలు ఇవ్వలేదని, అందుకే ఇప్పుడు సాంకేతిక ఆధారాలతో కోర్టులో పిటిషన్లు పడ్డాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ప్రభుత్వంలో న్యాయపరమైన అంశాలు చూసే అధికారుల లోపమా లేదా విభాగాధిపతుల అలసత్వమా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు ఎలాంటి జాప్యం లేకుండా 'గ్రీన్ ఛానెల్' ద్వారా నిధులను నేరుగా విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు హైకోర్టు స్టేను రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. దీని రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారని మండిపడ్డారు.
'గత ప్రభుత్వం తెచ్చిన పథకం అని నిర్లక్ష్యం చేయకుండా కొనసాగిస్తున్నాం. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎంత మందికి ఇళ్లు ఇచ్చారు. ఎంత మందికి ఉపాధి కల్పించారు చర్చ చేద్దాం. బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తూ నిరసనలు తెలుపుతుంది. పేదలకు నష్టం కలగకుండా న్యాయపరంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ప్రభుత్వం వినియోగిస్తుంది. అదే సమయంలో ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర కౌంటర్ అఫిడవిట్ ద్వారా పథకాల చట్టబద్ధత, రాజ్యాంగబద్ధత, ప్రజా ప్రయోజనాన్ని వివరించింది.' అని పొన్నం ప్రభాకర్ అన్నారు.
{{/usCountry}}'గత ప్రభుత్వం తెచ్చిన పథకం అని నిర్లక్ష్యం చేయకుండా కొనసాగిస్తున్నాం. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎంత మందికి ఇళ్లు ఇచ్చారు. ఎంత మందికి ఉపాధి కల్పించారు చర్చ చేద్దాం. బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తూ నిరసనలు తెలుపుతుంది. పేదలకు నష్టం కలగకుండా న్యాయపరంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ప్రభుత్వం వినియోగిస్తుంది. అదే సమయంలో ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర కౌంటర్ అఫిడవిట్ ద్వారా పథకాల చట్టబద్ధత, రాజ్యాంగబద్ధత, ప్రజా ప్రయోజనాన్ని వివరించింది.' అని పొన్నం ప్రభాకర్ అన్నారు.
{{/usCountry}}