మునుగోడులో లిక్కర్ అమ్మకాలపై కోమటిరెడ్డి సొంత రూల్స్.. పాటించకపోతే అంతే!
తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాలకు ఒక రకమైన రూల్స్ ఉంటే.. మునుగోడులో మాత్రం తాను పెట్టిన రూల్స్ ఫాలో కావాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన పేరుతో పోస్టర్లు దర్శనమిచ్చాయి.
తెలంగాణలో కొత్త వైన్ షాపులకు టెండర్ల ప్రక్రియ నడుస్తోంది. అయితే మునుగోడులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ రూల్స్తో సంబంధం లేకుండా తాను చెప్పేవి ఫాలో కావాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని వైన్ షాపులకు టెండర్లు వేసేవారు తాను పెట్టిన షరతులు పాటించాలంటున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని మునుగోడు, గట్టుప్పల్, చండూరు, నాంపల్లి, మర్రిగూడ, నాంపల్లి, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో టెండర్లు వేసేవారు తాను పెట్టిన షరతులు పాటించాలని చెబుతున్నారు.

కొత్త వైన్ షాపులు దక్కించుకునేవారు సిట్టింగ్లు పెట్టకూడదని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. అంతేకాదు ఊరి బయట వైన్ షాపు ఉండాలన్నారు. బెల్టు షాపులకు మద్యం విక్రయించకూడదని అంటున్నారు. వైన్ షాపు యజమానులు సిండికేట్గా మారవద్దని హెచ్చరించారు. సాయంత్రం 4:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయించాలన్నారు. ఈ మేరకు మునుగోడుకు కొత్త రూల్స్ సెట్ చేస్తూ బహిరంగ ప్రకటన చేశారు.
రాష్ట్రం మెుత్తం అమలు అయ్యే నిర్ణయాలు తమ వద్ద అమలు కాకూడదని చెప్పకనే చెప్పారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. టెండర్లను మండలానికి చెందిన స్థానికులు మాత్రమే వేయాలని, ఇతర మండలానికి చెందిన వ్యక్తులు వేయకూడదని స్పష్టం చేశారు. వైన్ షాపుకు అనుబంధంగా పర్మిట్ రూమ్ ఉండొద్దన్నారు.
ఈ రూల్స్ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేదని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, బెల్టు షాపుల నిర్మూలన, మహిళల సాధికారతే తమ ఉద్దేశమని పేర్కొన్నారు కోమటిరెడ్డి. ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదని, నియోజకవర్గ ప్రజలు, యువత మద్యం మత్తును వదిలి ఆర్థికంగా ఎదగాలన్నది తన కోరిక అని చెప్పారు. షరతులు పాటించని వారు టెండర్స్ వేయవద్దని, తదుపరి నష్టపోకూడదని సూచించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి.
ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టిన కొత్త రూల్స్ వైరల్ అవుతున్నాయి. రాష్ట్రం మెుత్తం అమలు చేసే నిర్ణయాలు తమ నియోజకవర్గంలో చెల్లవని క్లారిటీ ఇచ్చారు. దీంతో మద్యం దుకాణాలకు టెండర్లు వేసే వారిలో ఆందోళన మెుదలైంది. తనను కాదని మునుగోడులో మద్యం దుకాణాలు నడపలేరని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు కోమటిరెడ్డి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


