మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై కీలక పరిణామం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం నదీ తీర అభివృద్ధి కోసం అధికారికంగా భూసేకరణ ప్రారంభించడంతో మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు తొలి ప్రధాన అడుగు పడినట్టైంది. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్తో ఎంపిక చేసిన ప్రాంతాలలో భూసేకరణను అధికారికంగా ప్రారంభమైంది.

ఈ మేరకు మూసీ అభివృద్ధికి భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మెుదలుపెట్టింది. ప్రతిష్టాత్మకమైన మూసీ నది పునరుజ్జీవన ప్రణాళికకు అవసరమైన భూమిని సేకరించడానికి అధికారులు ప్రాథమిక పనులను ప్రారంభించారు. ఫేజ్ ఏ1లో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్లు, ఫేజ్ ఏ2లో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్లు పరిధిలో భూసేకరణ చేపట్టనున్నారు అధికారులు.
మొదటి దశలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని గోల్కొండ, గండిపేట మండలాల్లో 50 ఎకరాలకు పైగా భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు ఇప్పటికే సర్వే నంబర్లు, గ్రామాల వివరణాత్మక జాబితాను విడుదల చేశారు. అధికారులు భూ యజమానులకు న్యాయమైన పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.
భూ యజమానులు హక్కుల పత్రాలు(పట్టాలు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు) తగిన సమయంలో సమర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత సమయంలో తెలియజేయాలని అధికారులు సూచనలు చేశారు. ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొంది.
భూ యజమానుల నుండి అభ్యంతరాలను కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. అనుమానాలు ఉన్నవారు నోటిఫికేషన్లో పేర్కొన్న గడువులోపు రాతపూర్వకంగా అడగాలి. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలను విస్తరించి ఉంటుంది . ఇది 14 మండలాలు, 46 గ్రామాలను కవర్ చేస్తుంది. నదికి 55 కిలోమీటర్ల విస్తీర్ణంలో దశలవారీగా అభివృద్ధి పనులను చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు మూసీ నదిని శుభ్రపరచడం, పరిసర ప్రాంతాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. మూసీ వెంబడి పర్యాటక కేంద్రాలు, ఉద్యానవనాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
{{/usCountry}}ఈ ప్రాజెక్టు మూసీ నదిని శుభ్రపరచడం, పరిసర ప్రాంతాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. మూసీ వెంబడి పర్యాటక కేంద్రాలు, ఉద్యానవనాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
{{/usCountry}}భూసేకరణ ఊపందుకుంటున్నందున నిర్మాణాలకు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రాథమిక సేకరణ ప్రక్రియ ముగిసిన తర్వాత మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు అమలు దశలోకి వెళ్లే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
సర్వే నెంబర్లు, గ్రామాల వారీగా పూర్తి జాబితాను ఇప్పటికే ప్రకటించారు. Land Acquisition Act, 2013 నిబంధనల ప్రకారం భూసేకరణ ప్రక్రియ చేపడుతారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మూసీ అభివృద్ధి పనులు దశలవారీగా జరగనున్నాయి.