...
...
Next Story

స్కానింగ్ సెంటర్‌ వాష్‌రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఇంటర్ బాలిక.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

నాగర్ కర్నూల్ జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థిని స్కానింగ్ సెంటర్‌లో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Updated on: Mar 4, 2026, 14:31:16 IST
Advertisement

నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లిలో ఇంటర్మీడియట్ విద్యార్థిని స్కానింగ్ సెంటర్‌లోని వాష్‌రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలిక కళాశాలలో పరీక్షకు హాజరవుతుండగా తీవ్రమైన కడుపు నొప్పిగా ఉందని ఫిర్యాదు చేసింది. ఇన్విజిలేటర్ తల్లిదండ్రులను అప్రమత్తం చేసి, వారు కళాశాలకు చేరుకుని ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి.. స్కానింగ్ చేయించుకోవాలని సూచించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

స్కానింగ్ సెంటర్ సిబ్బంది ప్రక్రియ ప్రారంభించబోతుండగా, వాష్‌రూమ్‌కి వెళ్లి బిడ్డను ప్రసవించింది. దీంతో అందరూ షాక్‌కు గురయ్యారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు పోక్సో చట్టంలోని సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేశారు. శిశువు, బిడ్డ ఇద్దరూ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తన అమ్మమ్మ ఊరికి చెందిన తన వయసు వ్యక్తితోనే సంబంధం పెట్టుకుందని తెలుస్తోంది. పదో తరగతి పరీక్షలు రాసేప్పుడు ఇద్దరూ పరిచయం అయ్యారు. ఆ తర్వాత కేజీబీవీలో బాలిక చేరింది. ఈ క్రమంలో సెలవు రోజుల్లో బాలిక తన అమ్మమ్మ ఊరికి వెళ్తుండేది. ఈ సమయంలోనే బాలుడి తల్లిదండ్రులు లేనప్పుడు ఇద్దరూ కలిసేవారు.

ఈ క్రమంలోనే బాలిక గర్భం దాల్చినట్టుగా ప్రచారం అవుతోంది. అయితే కేజీబీవీ అసలు విషయం బయట పడకుండా.. బాలిక వదులుగా ఉండే దుస్తులు వేసుకునేదని తెలుస్తోంది. వైద్య పరీక్షలు నిర్వహించే సమయంలో తాను ఆరోగ్యంగా ఉన్నట్టుగా చెప్పుకొనేది. అవసరం లేదని తెలిపేది.

ఇటీవలే సేమ్ ఘటన

సదరు విద్యార్థిని నెమ్మదిగా నడుచుకుంటూ బయటికి వచ్చింది. ఆమె తీరును గమనించిన సిబ్బంది ఆమెను ప్రశ్నించారు. బాలిక పలు వివరాలు చెప్పటంతో.. అసలు విషయం బయటపడింది. టాయిలెట్ లోకి వెళ్లిచూడగా.. బేసిన్‌లో చనిపోయిన శిశువు పడి ఉండటాన్ని సిబ్బంది గమనించారు. పరువు పోతుందనే భయంతోనే ఎవరికీ అనుమానం రాకుండా శిశువును బాత్రూం బేసిన్‌లో కుక్కినట్లు బాలిక తెలిపినట్లు సిబ్బంది తెలిపారు. దీంతో పరీక్షా కేంద్రం నిర్వాహకులు విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులకు ద్వారా తెలియజేశారు. బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks