...
...
Next Story

నల్సార్ స్నాతకోత్సవానికి సీజేఐ వద్దంటూ విద్యార్థుల అభ్యంతరం

హైదరాబాద్‌ 'నల్సార్' స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసుల దౌర్జన్యంపై దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సీజేఐ ధర్మాసనం నిరాకరించడమే ఇందుకు కారణమని స్పష్టం చేశారు.

Published on: Aug 10, 2026, 08:14:27 IST
Advertisement

హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (నల్సార్) లా విశ్వవిద్యాలయంలో రాబోయే స్నాతకోత్సవ ఆహ్వానం తీవ్ర చర్చనీయాంశమైంది. తమ వార్షిక స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా పిలవడాన్ని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటున్న విద్యార్థుల బృందం బహిరంగంగా వ్యతిరేకించింది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ విశ్వవిద్యాలయ నిర్వహణ మండలికి ఒక ఈ-మెయిల్ ద్వారా తమ నిరసనను తెలియజేశారు.

నిరసనకు కారణాలు ఇవే

నల్సార్ స్నాతకోత్సవానికి సీజేఐ వద్దంటూ విద్యార్థుల అభ్యంతరం
నల్సార్ స్నాతకోత్సవానికి సీజేఐ వద్దంటూ విద్యార్థుల అభ్యంతరం

జూలై 20న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ 'కాక్రోచ్ జనతా పార్టీ' ఆధ్వర్యంలో 'ఛలో సన్సద్' ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనపై ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్), సీఆర్‌పీఎఫ్ బలగాలు ఉక్కుపాదం మోపాయి. ఆందోళనకారులను చెదరగొట్టడానికి భాష్ప వాయుగోళాలు, లాఠీఛార్జ్, ఎలక్ట్రిక్ బ్యాటన్లు, పెల్లెట్ తుపాకులను సైతం ప్రయోగించడంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు.

ఈ నేపథ్యంలో పోలీసుల దౌర్జన్యాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు జూలై 22న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. పోలీసులు జరిపిన దాడికి సంబంధించిన వీడియో ఆధారాలను కోర్టుకు చూపించేందుకు న్యాయవాదులు ప్రయత్నించినప్పటికీ, సీజేఐ దానిని తోసిపుచ్చారు. "మాకు వీడియోలు చూడటంలో ఆసక్తి లేదు, వాటిని చూసే సమయం కూడా లేదు" అని సీజేఐ వ్యాఖ్యానించారు.

రాజ్యాంగ విలువలపై విద్యార్థుల ప్రశ్నాస్త్రం

స్నాతకోత్సవ ఆహ్వానాన్ని వ్యతిరేకిస్తూ నల్సార్ యాజమాన్యానికి పంపిన లేఖలో విద్యార్థులు తమ ఆవేదనను స్పష్టంగా వ్యక్తపరిచారు.

"చట్టాన్ని అభ్యసిస్తున్న విద్యార్థులుగా రాజ్యాంగ హక్కులు, న్యాయం పొందడం, బాధిత వ్యక్తుల విన్నపాలను ఆలకించడం వంటి సూత్రాలు మాకు అత్యంత ముఖ్యం. విశ్వవిద్యాలయం ఎంచుకునే ముఖ్య అతిథిలో ఈ విలువలు ప్రతిబింబించాలి. నిరసనకారులపై పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా పరిగణించని వ్యక్తి చేతుల మీదుగా పట్టాలు తీసుకోవడం, నల్సార్‌లో మేం నేర్చుకున్న సూత్రాలకు భిన్నంగా ఉంది" అని విద్యార్థులు ఆ లేఖలో పేర్కొన్నట్లు పీటీఐ (PTI) తెలిపింది.

వర్సిటీ యాజమాన్యం నుంచి రాని స్పందన

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe