తెలంగాణ రాష్ట్రంలోని 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల విభాగం కీలక ప్రకటన విడుదల చేసింది. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ (NMMSS) పరీక్ష 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ, పరీక్ష రుసుము చెల్లింపు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కె. లింగయ్య విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. విద్యార్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి, పరీక్ష రుసుము చెల్లించడానికి సెప్టెంబర్ 01, 2026 వరకు గడువు పొడిగించారు. ప్రభుత్వ, జెడ్పీ, పురపాలక, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ (12వ తరగతి) వరకు నెలకు రూ.1,000 చొప్పున (ఏడాదికి రూ.12,000) కేంద్ర ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్ అందుతుంది. దరఖాస్తు నమోదు, నిబంధనలు, పూర్తి వివరాల కోసం అభ్యర్థులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ పరీక్షల విభాగానికి చెందిన అధికారిక వెబ్సైట్ http://bse.telangana.gov.in ను సందర్శించవచ్చు.
ఈ గడువు పెంపునకు సంబంధించిన ఉత్తర్వుల ప్రతిని రాష్ట్రంలోని జిల్లాల విద్యాశాఖాధికారులు, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్లకు తగిన చర్యల నిమిత్తం పంపించారు. అర్హులైన 8వ తరగతి విద్యార్థులు ఈ పొడిగించిన అవకాశాన్ని ఉపయోగించుకుని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఆన్లైన్లో నమోదు చేసుకున్న దరఖాస్తు ఫారాల ప్రింటెడ్ కాపీ, ఎన్ఆర్ (రెండు కాపీలు), ఎస్బిఐ కలెక్ట్ ఫీజు రసీదులను సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సంబంధిత జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 3వ తేదీగా నిర్ణయించారు. ప్రింటెడ్ దరఖాస్తు ఫారం, ఎన్ఆర్ తప్పనిసరిగా సంబంధిత ప్రధానోపాధ్యాయునితో ధృవీకరించబడాలి. బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు కుల ధృవీకరణ పత్రం, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వైద్య ధృవీకరణ పత్రం జతచేయాలి. లేదంటే వారిని జనరల్ అభ్యర్థులుగా పరిగణిస్తారు. అభ్యర్థులందరూ ఆదాయ ధృవీకరణ పత్రాన్ని జతచేయాలి. లేకుంటే దరఖాస్తు రద్దు అవుతుంది.
భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రాయోజిత జాతీయ అర్హత-ఆధారిత స్కాలర్షిప్ పథకాన్ని (N.M.M.S.S) ప్రారంభించింది. అర్హత ఉన్న పాఠశాలల నుండి 8వ తరగతి చదువుతూ.. ఓసీ/బీసీ అభ్యర్థుల విషయంలో కనీసం 55 శాతం మార్కులు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల విషయంలో 50 శాతం మార్కులు పొంది, వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 3,50,000 మించకుండా ఉంటే, ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
{{/usCountry}}భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రాయోజిత జాతీయ అర్హత-ఆధారిత స్కాలర్షిప్ పథకాన్ని (N.M.M.S.S) ప్రారంభించింది. అర్హత ఉన్న పాఠశాలల నుండి 8వ తరగతి చదువుతూ.. ఓసీ/బీసీ అభ్యర్థుల విషయంలో కనీసం 55 శాతం మార్కులు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల విషయంలో 50 శాతం మార్కులు పొంది, వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 3,50,000 మించకుండా ఉంటే, ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
{{/usCountry}}మెంటల్ ఎబిలిటీ టెస్ట్(M.A.T) – 90 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు. విద్యా సామర్థ్య పరీక్ష (S.A.T) 7వ, 8వ తరగతుల సైన్స్, గణితం, సాంఘిక శాస్త్రాల నుండి 90 మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
ఈ లింక్ క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ వెళ్లండి.