School Holiday : జులై 11 రెండో శనివారం స్కూళ్లకు సెలవు ఉందా? లేదా?
Telangana School Holiday : జులై 11న రెండో శనివారం. చాలా మంది పాఠశాలలకు సెలవు ఉందా? లేదా? అనే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ క్లారిటీగా తెలుసుకోండి.
తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సాధారణంగా ఇచ్చే రెండో శనివారం సెలవును రద్దు చేసింది. అందుకే జూలై 11వ తేదీని అన్ని పాఠశాలలకు పనిదినంగా ప్రకటించింది. పాఠశాలల పునఃప్రారంభాన్ని జూన్ 12 నుంచి జూన్ 15కు వాయిదా వేయడంతో కోల్పోయిన విద్యా సమయాన్ని భర్తీ చేయడమే విద్యాశాఖ లక్ష్యం. జూలై 11న పాఠశాలలకు సెలవు లేనందున ఈ రెండో శనివారం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు యథావిధిగా పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుంది.

పాఠశాల విద్యా శాఖ జూన్ నెలలో వేసవి సెలవులను పొడిగించింది. విద్యా సంవత్సరం ప్రకారం పాఠశాలలు జూన్ 12న తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే సంబంధిత వర్గాల విజ్ఞప్తుల కారణంగా జూన్ 13 రెండో శనివారం, జూన్ 14 ఆదివారం కావడంతో విద్యాశాఖ పాఠశాలల పునఃప్రారంభాన్ని జూన్ 15కు వాయిదా వేసింది.
పాఠశాలల పునఃప్రారంభం వాయిదా పడటం వలన కోల్పోయిన విద్యా సమయాన్ని భర్తీ చేయడానికి, 2026-27 విద్యా క్యాలెండర్ ప్రకారం నిర్దేశించిన బోధనా దినాలను కచ్చితంగా పాటించేలా చూసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే అన్ని పాఠశాలలకు జూలై 11వ తేదీ (రెండో శనివారం)ని పనిదినంగా ప్రకటించింది.
ఇక మరోవైపు ఏడు వామపక్ష విద్యార్థి సంఘాల కూటమి తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం(జులై 10) విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడంతో, పలు విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ, ఏఐడీఎస్ఓ, ఏఐఎఫ్డీఎస్, ఏఐఎస్బీ, ఏఐపీఎస్యులతో కూడిన కూటమి.. ప్రభుత్వం 27,000 ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే పేరుతో 4,000 క్లస్టర్ క్యాంపస్లుగా కుదించాలని చూస్తోందని ఆరోపించింది. ఆ ప్రతిపాదనను రద్దు చేయాలని డిమాండ్ చేసింది.
అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం పూర్తికాల విద్యాశాఖ మంత్రిని నియమించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఎంఈఓ, డీఈఓ, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని లెఫ్ట్ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ల కింద రూ. 7,000 కోట్లను విడుదల చేయాలని పేర్కొన్నాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


