హైదరాబాద్‌లో ఫేక్ ఐటీ కంపెనీ.. మోసపోయిన 400 మంది.. ఒక్కొక్కరి దగ్గర రూ.3 లక్షలు వసూలు!

ఐటీ హబ్‌గా పేరుగాంచిన హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ఏరియాలో మరోసారి భారీ మోసం వెలుగులోకి వచ్చింది . NSN ఇన్ఫోటెక్ పేరుతో నడుస్తున్న నకిలీ ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది.

Published on: Nov 26, 2025, 16:45:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మాదాపూర్‌లోని ఒక నకిలీ ఐటీ కంపెనీ కొన్ని వందల మంది నిరుద్యోగులను మోసం చేసింది. శిక్షణ, ఉద్యోగ నియామకాల కోసం బాధితులను భారీ మొత్తంలో డబ్బు చెల్లించేలా చేసి మోసగించింది. నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి కోట్లాది రూపాయలు దోచుకుంది . రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది. దీని వెనుక సూత్రధారి స్వామి నాయుడు, అతని కుటుంబం పరారీలో ఉన్నారు.

ఫేక్ ఐటీ కంపెనీ
ఫేక్ ఐటీ కంపెనీ

NSN ఇన్ఫోటెక్ కంపెనీ గత కొన్ని నెలలుగా మాదాపూర్‌లోని ఒక భవనంలోని కార్యాలయం పెట్టుకుని పనిచేస్తోంది. ఇది 'ఫుల్ స్టాక్ డెవలపర్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ' వంటి అధిక డిమాండ్ ఉన్న కోర్సులలో శిక్షణ అందించింది. శిక్షణ తర్వాత తన కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రతి నిరుద్యోగి దగ్గర నుండి రూ. 2.5 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు రుసుము వసూలు చేసింది . ఈ విధంగా మొత్తం 400 మంది విద్యార్థుల నుండి దాదాపు రూ. 10-12 కోట్లు వసూలు చేసినట్లు చెబుతున్నారు.

అయితే ఎప్పటిలాగే ఈ ఉదయం తరగతులకు వచ్చిన నిరుద్యోగులు షాక్ అయ్యారు. కంపెనీ బోర్డు తిప్పేసింది. శిక్షణ ఇవ్వకుండా తలుపులు మూసి ఉంచారు. యాజమాన్యం ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చాయి. వాట్సాప్ గ్రూపులు డిలీట్ చేశారు. స్వామి నాయుడు, అతని భార్య, కంపెనీకి చెందిన మరికొందరు ముఖ్య వ్యక్తులు కనిపించడం లేదు. నిరుద్యోగులు ఆఫీసుకు చేరుకుని తలుపు తట్టినప్పుడు ఎవరూ స్పందించలేదు.

'మాకు కూడా అద్దె చెల్లించలేదు, ఎవరో వచ్చి లాక్ చేశారు.' అని ఇంటి యజమాని చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై బాధితులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఆ కంపెనీ డైరెక్టర్ స్వామి నాయుడు, శిక్షణ పూర్తయిన తర్వాత వారికి కంపెనీలో ఉద్యోగం ఇస్తామని ఉద్యోగార్థులకు చెప్పాడు. అతని మాట నమ్మిన అభ్యర్థులు డబ్బులు చెల్లించారు. ఆ తర్వాత నాయుడు ఆ డబ్బుతో పరారీ అయ్యాడు. బాధితులు సైబరాబాద్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగాన్ని ఆశ్రయించారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More