పైరసీ సినిమాలతో వచ్చిన డబ్బును స్నేహితులకు ట్రాన్స్ఫర్ చేసిన ఐబొమ్మ రవి!
ఐబొమ్మ, బప్పం పోర్టల్స్ వ్యవస్థాపకుడు ఇమంది రవిని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ సమయంలో కొన్ని విషయాలను రవి దాటవేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఐబొమ్మ, బప్పం పోర్టల్లలో పైరేటెడ్ సినిమాలను పబ్లిష్ చేసిన ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఇమంది రవి, నేరాల ద్వారా సంపాదించిన డబ్బును తన స్నేహితులకు బదిలీ చేసినట్లు హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ డబ్బులు ఎక్కువగా సంపాదించాడు. రవి ఐదు రోజుల పాటు హైదరాబాద్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అధికారులు విచారణ చేస్తున్నారు. విచారణ సమయంలో రవి తన సంపాదనను అనేక దేశాల పర్యటనలకు ఖర్చు చేశానని, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్లో కొన్ని ఆస్తులను కొనుగోలు చేశానని చెప్పాడు. విదేశాలలో ఉన్న అతని ఖాతాలలో పెద్ద మొత్తంలో డిపాజిట్లు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

సోమవారం ప్రశ్నల తర్వాత పోలీసులు రవిని కోర్టు ముందు హాజరుపరుస్తారు. సాంకేతిక ఆధారాలు పొందిన పోలీసు అధికారులు రవి డేటాను నిల్వ చేయడానికి, తన పోర్టల్లను నిర్వహించడానికి ఉపయోగించిన సర్వర్ల ఐపీ చిరునామాలను పరిశీలించారు. సర్వర్ ఐపీ వివరాలను తాను మర్చిపోయానని రవి పోలీసులకు చెప్పాడు.
విదేశాల నుంచి తిరిగి వచ్చిన కొద్ది నిమిషాలకే రవిని హైదరాబాద్లోని తన నివాసం వద్ద పట్టుకున్నారు పోలీసులు. అయితే రవి ఇంటి తలుపు తట్టినప్పుడు అతడు చాలా సేపు డోర్ ఓపెన్ చేయలేదు. వాష్రూమ్లో తన ల్యాప్టాప్ను ఉపయోగించి సంబంధిత డేటాను మార్చగలిగాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
అతని సర్వర్ల కోసం ఉపయోగించిన ఐపీ చిరునామాలను గుర్తించడానికి నిపుణులు అతని ల్యాప్టాప్ నుండి తొలగించిన డేటాను తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. రవి పోలీసులకు తన వ్యక్తిగత వివరాలను మాత్రమే అందించాడు, అతని వ్యాపార కార్యకలాపాల గురించి పెద్దగా చర్చించడం లేదు. ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడానికి పోలీసులు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న రవి స్నేహితుల వివరాలను సేకరించినట్లు సమాచారం.
విచారణలో భాగంగా పోలీసులకు ఐబొమ్మ రవి సరైన సమాధానాలు చెప్పడం లేదని తెలుస్తోంది. విదేశాల్లో సర్వర్లు, యూకే, కరేబియన్ దీవుల్లో పని చేస్తున్న సిబ్బంది గురించి అడగగా.. డేటా విదేశాల్లో ఉందని సమాధానం చెప్పాడు. మూడు నెలలపాటు రవిపై నిఘా ఉంచిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


