వేములవాడ రాజన్న దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో మొక్కుల చెల్లింపు జరుగుతోంది. మరికొద్ది రోజుల్లోనే మేడారం జాతర షురూ కానుంది. అయితే ఈ జాతరకు ముందు భక్తులు వేములవాడ రాజన్నకు కోడె మొక్కులతో పాటు వివిధ ఆర్జిత సేవల మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కాబట్టి భక్తులు భారీగా తరలివస్తూ… మొక్కులు చెల్లించుకుంటున్నారు.

భక్తులు భారీ సంఖ్యలో వస్తుండటంతో బద్ది పోచమ్మ ఆలయం వద్ద కూడా రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఆలయ పరిసరాలు భక్తజనసంద్రంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 4 రోజుల పాటు 24 గంటల పాటు దర్శనాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.
24 గంటలపాటు దర్శనాలు…!
భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇవాళ(డిసెంబర్ 28) 24 గంటలపాటు తెరిచి ఉంచున్నారు. ఈ మేరకు వేములవాడ ఆలయ ఈవో రమాదేవి శనివారం ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా జనవరి 4, 11, 18 తేదీల్లో కూడా 24 గంటలపాటు దర్శనాలు ఉండనున్నాయి. ఇక బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయ దర్శనాలను కూడా ఈనెల 29వ తేదీన 24 గంటలపాటు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ఆయా తేదీల్లో చాలా మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దర్శనం తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పక్కనే ఉన్న భీమేశ్వరాలయంలో దర్శనాల కోసం ఏర్పాట్లు చేశారు.
ప్రధాన ఆలయంలోనూ ఏకాంత సేవలు యథావిధిగా కొనసాగుతాయి. అయితే భీమేశ్వరాలయంలో కోడెమొక్కు, అభిషేకాలు, కుంకుమపూజ, నిత్య కల్యాణం, చండీయాగం వంటి పూజలు నిర్వహిస్తున్నారు.
{{/usCountry}}ప్రధాన ఆలయంలోనూ ఏకాంత సేవలు యథావిధిగా కొనసాగుతాయి. అయితే భీమేశ్వరాలయంలో కోడెమొక్కు, అభిషేకాలు, కుంకుమపూజ, నిత్య కల్యాణం, చండీయాగం వంటి పూజలు నిర్వహిస్తున్నారు.
{{/usCountry}}మరోవైపు శృంగేరి పీఠాధిపతి సలహా మేరకు విస్తరణ పనులు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. భక్తులకు ప్రత్యామ్నాయ సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గర్భగుడిలో మండపాలు 64 నుండి 70 స్తంభాల నిర్మాణం కోసం పెద్ద నిర్మాణ సామగ్రిని ఉపయోగిస్తున్నారన్నారు. భక్తులను లోపలికి అనుమతిస్తే భద్రతా సమస్యలు తలెత్తుతాయని వివరించారు. విస్తరణ పనులు కొనసాగుతున్నప్పటికీ రాజన్నకు పూజలు కొనసాగుతున్నట్లు పేర్కొంటున్నారు.