Bhadrachalam : భద్రాద్రి రాములోరి కల్యాణ మహోత్సవం - ఆన్లైన్ టికెట్లు విడుదల, ఇలా బుకింగ్ చేసుకోండి
భద్రాచలంలో మార్చి 27న జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవం, పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఈ వేడుకలను వీక్షించే వారికి వీలుగా టిక్కెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. ఇవాళ్టి నుంచి (మార్చి 7) నుంచి వీటిని బుకింగ్ చేసుకోవచ్చు.
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ నెల 19వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ వేడుకలు జరగనున్నాయి.

మార్చి 27వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా సీతారాములకు వార్షిక కల్యాణం చేస్తారు. అత్యంత వైభవంగా నిర్వహించే క్రతువును భక్తులు వీక్షించేందుకు వీలుగా సెక్టార్ (విభాగం)లను ఏర్పాటు చేశారు. ఈ టికెట్లను బుకింగ్ చేసుకునేందుకు వీలుగా ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు. ఈ మేరకు దేవాదాయశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
బుకింగ్ ప్రాసెస్ ఇలా…
ఈ టికెట్లను భద్రాచలం రామాలయం అధికారిక వెబ్సైట్ https://bhadradritemple.telangana.gov.in/ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఇవాళ్టి నుంచే ఈ అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లిన తర్వతా హోం పేజీలోని శ్రీరామనవమి టికెట్ లింక్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ కల్యాణం సెక్టార్, పట్టాభిషేకం సెక్టార్ ఆప్షన్లు ఉంటాయి. మీకు కావాల్సిన సెక్టార్ పై క్లిక్ చేసి.. నిర్ణయించిన ఫీజును చెల్లించి టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు.
భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. రాములవారికి తలంబ్రాలు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తయారు చేసి పంపిస్తారు. స్వామి కళ్యాణం సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సు సర్వీసులను భద్రచలానికి నడుపుతాయి. ఈ సమయంలో భక్తుల రద్దీ కారణంగా అదనపు సర్వీసులు ఉంటాయి. సీతారామచంద్రుల కల్యాణోత్సవం తలంబ్రాలు కావాలంటే బుక్ చేసుకుంటే మీ ఇంటి వద్దకే వస్తాయి.
ఇంటికే తలాంబ్రాలు - ఆర్టీసీ సేవలు:
మార్చి 27వ తేదీన శ్రీరామనవమి. ఈ సందర్భంగా భద్రాచలంలో రాములవారి కళ్యాణం ఎంత వైభవంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాములవారి కళ్యాణంలోని తలంబ్రాలకు చాలా ప్రత్యేకత ఉంది. భక్తులు పవిత్రంగా భావిస్తారు. వాటిని కావాలని అనుకుంటారు. అలాంటి వారి కోసం టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. మీ ఇంటి వద్దే శ్రీరాములవారి కళ్యాణం తలంబ్రాలు పొందవచ్చు.
భక్తులు రూ.151 చెల్లించి.. https://tgsrtclogistics.co.in/TSRTC/ లేదంటే సమీపంలోని టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో బుకింగ్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం 040-69440069, 040-23450033ని సంప్రదించండి. ఇప్పటి నుంచి బుకింగ్ చేయవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

