...
...
Next Story

OU Distance Admissions : ఓయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలు - కొత్త నోటిఫికేషన్ విడుదల, ఇవిగో వివరాలు

OU Distance Admissions 2026 : ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జి.రామ్‌రెడ్డి దూరవిద్య కేంద్రం నుంచి అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ అయింది. 2026-27 విద్యాసంవత్సరానికి గాను వివిధ యూజీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

Published on: Aug 8, 2026, 17:35:27 IST
Advertisement

Osmania University Distance Education Admissions 2026 : ఉన్నత చదువులు అభ్యసించాలనుకునే ఉద్యోగులకు, దూరవిద్య ద్వారా డిగ్రీ, పీజీ పూర్తి చేయాలనుకునే విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ మంచి సువర్ణావకాశం కల్పించింది. యూజీసీ దూరవిద్య విభాగం గుర్తింపు పొందిన ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జి. రామ్‌రెడ్డి దూరవిద్య కేంద్రం (PGRRCDE)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. 2026-27 విద్యాసంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

కోర్సుల వివరాలు….

  • పీజీ కోర్సులు : ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA), ఎంకామ్ (M.Com), ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్). అలాగే ఎంఏ (MA) విభాగంలో హిందీ, ఉర్దూ, తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్, ఫిలాసఫీ, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, పబ్లిక్ పర్సనల్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులు ఉన్నాయి. గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు వీటికి అర్హులు.
  • యూజీ కోర్సులు : బీఏ , బీకామ్ (B.Com General), బీబీఏ (BBA) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియట్ లేదా 10+2 తత్సమాన విద్య పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సులు : మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్, బయోఇన్ఫర్మాటిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, డేటా సైన్స్, వేద జ్యోతిష్యం తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఏదేనీ డిగ్రీ అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
  • సర్టిఫికెట్ కోర్సులు : యోగా సర్టిఫికేట్ కోర్సులకు పదో తరగతి (SSC) లేదా తత్సమాన అర్హత, ఇతర సర్టిఫికేట్ కోర్సులకు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.

ఓయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలు
ఓయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలు

అన్ని పీజీ కోర్సులు 4 సెమిస్టర్ల (రెండు సంవత్సరాలు) వ్యవధిని, యూజీ కోర్సులు 6 సెమిస్టర్ల (మూడు సంవత్సరాలు) వ్యవధిని కలిగి ఉంటాయి. యోగా సర్టిఫికేట్ కోర్సు రెండు సెమిస్టర్లు (ఒక సంవత్సరం) కాగా… మిగిలిన సర్టిఫికేట్ కోర్సులు 6 నెలల వ్యవధి కలిగి ఉంటాయి.

పీజీ కోర్సులకు బోధనా మాధ్యమం ఇంగ్లీష్‌లో ఉంటుంది (తెలుగు, హిందీ, ఉర్దూ ఎంఏ కోర్సులతో పాటు ఎంఏ పొలిటికల్ సైన్స్ కోర్సు తెలుగు మాధ్యమంలో కూడా అందుబాటులో ఉంటుంది). డిగ్రీ (యూజీ) కోర్సులకు ఇంగ్లీష్, తెలుగు బోధనా మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి. విశ్వవిద్యాలయ నిబంధనల ప్రకారం ఏ కోర్సు నడవాలన్నా కనీసం 50 మంది విద్యార్థుల అడ్మిషన్లు తప్పనిసరిగా ఉండాలి.

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : ఆగస్టు 1, 2026
  • దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: సెప్టెంబర్ 11, 2026
  • ఆన్‌లైన్ తరగతుల ప్రారంభం: అక్టోబర్ 15, 2026

కోర్సుల ఫీజుల వివరాలు, సిలబస్, అర్హతలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విద్యార్థులు PGRRCDE అధికారిక వెబ్‌సైట్ http://www.oucde.net/index.php ను సందర్శించాలని అధికారులు సూచించారు.

ఈ లింక్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe