Summer Holidays : ఎండల ఎఫెక్ట్.. కాలేజీ విద్యార్థులకు వేసవి సెలవులు పొడిగింపు
ఎండల ఎఫెక్ట్తో తెలంగాణలో కాలేజీలకు వేసవి సెలవులు పెరిగాయి. ఈ మేరకు ఓయూతోపాటు పలు యూనివర్సిటీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
తెలంగాణలో ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం, ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఊరటనిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న తీవ్రమైన ఎండలు, వడగాల్పుల కారణంగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ కాలేజీలకు వేసవి సెలవులను పొడిగిస్తూ అధికారులు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని కళాశాలలకు వేసవి సెలవులను పొడిగించింది.
అధికారిక ఉత్తర్వు ప్రకారం.. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వ సహాయం పొందే, అనుబంధ, అనుసంధానిత అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలలకు సెలవును పొడిగించారు. ఈ నిర్ణయం ఉస్మానియా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కాన్స్టిట్యూయెంట్, అనుబంధ కళాశాలలకు వర్తిస్తుంది. షెడ్యూల్ ప్రకారం మే 31తో సెలవులు ముగియాల్సి ఉండగా, తాజా ఆదేశాల ప్రకారం జూన్ 6, 2026 వరకు సెలవులను పొడిగించారు. జూన్ 7 ఆదివారం కావడంతో తిరిగి జూన్ 8వ తేదీన కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి.
ఉస్మానియా యూనివర్సిటీ బాటలోనే రాష్ట్రంలోని మరికొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు కూడా సెలవులను పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీల పరిధిలోని కాలేజీలకు కూడా జూన్ 6 వరకు సెలవులు పొడిగించారు. ఇవి కూడా జూన్ 8న తెరుచుకుంటాయి.
కాకతీయ, శాతవాహన యూనివర్సిటీలు పరిధిలోని కళాశాలలకు జూన్ 5 వరకు సెలవులు పొడిగించారు. ఇవి జూన్ 6వ తేదీన పునఃప్రారంభం అవుతాయి.
గత కొన్ని రోజులతో పోలిస్తే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గినప్పటికీ, వడగాల్పుల తీవ్రత మాత్రం తగ్గలేదు. నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా ఖమ్మంలో 45.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాజధాని హైదరాబాద్ విషయానికి వస్తే, చార్మినార్ పరిధిలో అత్యధికంగా 41.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఎండల తీవ్రతకు తోడు ఉక్కపోత కూడా ఎక్కువగా ఉండటంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున విద్యార్థులు మధ్యాహ్నం వేళల్లో బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. పునఃప్రారంభ తేదీల్లో ఏవైనా మార్పులు ఉంటే సంబంధిత కాలేజీ యాజమాన్యాలను సంప్రదించాలని అధికారులు సూచించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


