తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులపై ప్రతి ఏటా మరీ మితిమీరి పడుతున్న ఫీజుల భారాన్ని అరికట్టేందుకు, పాఠశాలల యాజమాన్యాల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేసేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాల యాజమాన్యాలు తమ తరగతుల వారీ ఫీజుల వివరాలను తగిన ఆధారాలతో సహా డిపార్ట్మెంట్ అధికారిక పోర్టల్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

పాఠశాల యాజమాన్యాలు తమ వద్ద అమల్లో ఉన్న ఫీజు వివరాలను విద్యాశాఖ అధికారిక పోర్టల్ అయిన https://schooledu.telangana.gov.in/ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలు నిర్బంధ రికార్డులను సమర్పించేలా చూడటంతో పాటు, ఏటేటా అడ్డగోలుగా పెంచుతున్న ఫీజుల దోపిడీకి చెక్ పెట్టడమే ఈ చర్య ముఖ్య ఉద్దేశం.
పాఠశాల విద్య సమగ్ర సంచాలకులు నవీన్ నికోలస్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని ప్రైవేట్ పాఠశాలలతో మాట్లాడి, ఈ విద్యాసంవత్సరానికి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కేవలం ఫీజు అంకెలను మాత్రమే కాకుండా, ఫీజుల నిర్ణయానికి సంబంధించి పారదర్శకత కోసం పాఠశాలలు కొన్ని వివరాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. తరగతుల వారీగా వసూలు చేస్తున్న ఫీజు నిష్పత్తి వివరాలు, ఫీజు ఖరారు చేయడానికి నిర్వహించిన చర్చలు, దానికి సంబంధించిన నివేదికలు మరియు ఆధారిత పత్రాలు, పాఠశాల గవర్నింగ్ బోర్డు సభ్యుల సంతకాలతో కూడిన రికార్డులు అప్లోడ్ చేయాలి.
పాఠశాల నోటీసు బోర్డుల్లో ఫీజు వివరాలను ప్రదర్శించని లేదా విద్యాశాఖ పోర్టల్లో సమాచారాన్ని నమోదు చేయడంలో విఫలమైన ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలపై నిబంధనల ప్రకారం షోకాజ్ నోటీసులు జారీ చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది.
{{/usCountry}}పాఠశాల నోటీసు బోర్డుల్లో ఫీజు వివరాలను ప్రదర్శించని లేదా విద్యాశాఖ పోర్టల్లో సమాచారాన్ని నమోదు చేయడంలో విఫలమైన ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలపై నిబంధనల ప్రకారం షోకాజ్ నోటీసులు జారీ చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది.
{{/usCountry}}ఈ నిర్ణయం ద్వారా ప్రైవేట్ స్కూళ్లలో పారదర్శకత పెరగడమే కాకుండా, విచ్చలవిడిగా ఫీజులు పెంచే సంస్కృతికి అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. ప్రతి స్కూల్ విద్యాశాఖ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని ప్రభుత్వం తేల్చిచెప్పింది.