సికింద్రాబాద్ - లాలాగూడ రైల్వే స్టేషన్ల మధ్య ఓవర్హెడ్ ఎలక్ట్రికల్ ఈక్విప్మెంట్ (OHE) సాంకేతిక సమస్యతో హఠాత్తుగా నిలిచిపోవడంతో రైళ్ల రాకపోకలకు కొంతసేపు విఘాతం కలిగింది. ఆదివారం రాత్రి 10:38 గంటల సమయంలో విద్యుత్ సరఫరాలో సాంకేతిక లోపం తలెత్తినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు వెల్లడించారు.

ఘటన సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సాంకేతిక సిబ్బంది హుటాహుటిన రెస్క్యూ పనుల్లోకి దిగి, విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పర్యవేక్షణ చేపట్టారు. సిబ్బంది వేగంగా స్పందించడంతో ప్రధాన మార్గంలో రైళ్ల సేవలు సజావుగా పునరుద్ధరించారు. ప్రస్తుతం అప్ , డౌన్ లైన్లలో రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు.
విజయవాడ ఎక్స్ప్రెస్ నిలిపివేత…
ఓవర్ హెడ్ విద్యుత్ తీగలు ట్రిప్ అవ్వడం వల్ల ఈ మార్గంలో ప్రయాణించే కొన్ని రైళ్లు దాదాపు 10 నిమిషాల కంటే తక్కువ సమయం పాటు మార్గమధ్యంలో నిలిచిపోయాయి. ముఖ్యంగా రైలు సంఖ్య 12795 విజయవాడ-లింగంపల్లి ఎక్స్ప్రెస్ రైలు లాలాగూడ విభాగంలో కొంతసేపు నిలిచిపోగా…. ఆ తర్వాత అధికారులు దాన్ని సికింద్రాబాద్ వైపు సురక్షితంగా పంపించారు. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి గాయాలు కానీ, ఎలాంటి ప్రాణనష్టం కానీ జరగకపోవడంతో రైల్వే యంత్రాంగం మరియు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదిలా ఉండగా… శనివారం ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లా శిఖోహాబాద్ రైల్వే స్టేషన్లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్లో నిలిపి ఉంచిన ఒక ఖాళీ రైలు బోగీలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. కాసేపట్లోనే బోగీ నలువైపులా పొగలు, మంటలు దట్టంగా అలుముకున్నాయి.
విషయం గమనించిన స్థానిక మహిళ మాయాదేవి వర్మ వెంటనే సమాచారాన్ని మిగతా వారికి తెలపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. "నేను బోగీ నుంచి పొగలు రావడం చూసి వెంటనే బయటకు వచ్చి అందరినీ అప్రమత్తం చేశాను," అని ఆమె తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు పక్కనున్న ఇతర బోగీలకు వ్యాపించకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యగా ప్రభావితమైన బోగీని ఇతర కోచ్ల నుంచి వేరు చేశారు. ఈ ఘటనపై రైల్వేశాఖ దర్యాప్తు చేపట్టింది.
{{/usCountry}}విషయం గమనించిన స్థానిక మహిళ మాయాదేవి వర్మ వెంటనే సమాచారాన్ని మిగతా వారికి తెలపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. "నేను బోగీ నుంచి పొగలు రావడం చూసి వెంటనే బయటకు వచ్చి అందరినీ అప్రమత్తం చేశాను," అని ఆమె తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు పక్కనున్న ఇతర బోగీలకు వ్యాపించకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యగా ప్రభావితమైన బోగీని ఇతర కోచ్ల నుంచి వేరు చేశారు. ఈ ఘటనపై రైల్వేశాఖ దర్యాప్తు చేపట్టింది.
{{/usCountry}}