తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఒకేసారి ఇటు చల్లటి కబురు, అటు హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండగా.. మరోవైపు భానుడు తన ప్రతాపం చూపేందుకు సిద్ధమయ్యాడు. కొన్ని జిల్లాలకు ఏకంగా రెడ్ అలర్ట్ కూడా జారీ అయింది.

ద్రోణి ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు (సోమ, మంగళ, బుధ) తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
హైదరాబాద్తోపాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉంది.
వర్షాల ముప్పు ఇలా ఉంటే.. ఎల్లుండి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత పీక్ స్టేజ్కు చేరనుంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 45 డిగ్రీలు దాటే అవకాశం ఉండటంతో పలు జిల్లాలను వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలకు తీవ్రమైన వడగాల్పుల నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ అయింది. ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎండ తీవ్రత దృష్ట్యా రెడ్ అలర్ట్ కొనసాగనుంది.
మంగళవారం కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో వడగాలులు భీభత్సంగా వీచే అవకాశముంది. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప వృద్ధులు, పిల్లలు బయటకు రావద్దని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. ఉరుములు పడే సమయంలో చెట్ల కింద, కరెంట్ స్తంభాల వద్ద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండటం మంచిది.
{{/usCountry}}మంగళవారం కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో వడగాలులు భీభత్సంగా వీచే అవకాశముంది. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప వృద్ధులు, పిల్లలు బయటకు రావద్దని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. ఉరుములు పడే సమయంలో చెట్ల కింద, కరెంట్ స్తంభాల వద్ద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండటం మంచిది.
{{/usCountry}}