Rain Alert : తెలంగాణలో రాబోయే ఆరు రోజులు వర్షాలు.. ఐఎండీ వెదర్ అప్డేట్

Rain Alert Telangana : తెలంగాణలో రాబోయే ఆరు రోజులు వాతావరణం మారిపోనుంది. రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Published on: Mar 16, 2026 6:27 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత వాతావరణ శాఖ(IMD) సోమవారం (మార్చి 16, 2026) తెలంగాణ 14 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం హెచ్చరిక జారీ చేసింది. IMD బులెటిన్ ప్రకారం.. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు పడే అవకాశం ఉంది.

తెలంగాణ వర్షాలు
తెలంగాణ వర్షాలు

ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు కురుస్తాయని ఐఎండీ వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళ, బుధవారాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

తెలంగాణ జిల్లాలలోని ప్రజలు మార్చి 21 వరకు ఉరుములతో కూడిన వర్షాలు, క్రమంగా ఉష్ణోగ్రత తగ్గుదలను చూస్తారు. ఎండల నుంచి ఉపశమనం పొందనున్నారు. ఐఎండీ, హైదరాబాద్ వాతావరణ సూచన ప్రకారం..'రాబోయే 6 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ వరకు క్రమక్రమంగా తగ్గుతాయి. ఆదివారం నుండి తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.' అని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది.

మార్చి 16 సోమవారం నుండి మార్చి 21 వరకు హైదరాబాద్, తెలంగాణలోని పలు జిల్లాల్లో అనేక ప్రదేశాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు గంటకు 30-40 కి.మీ వేగంతో వీస్తాయని IMD తెలిపింది.

రాబోయే 24 గంటలు హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాలలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 36 మరియు 23 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

IMD ప్రకారం, కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో బలమైన గాలులతో పాటు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. మార్చి 21 వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున, అనేక జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నిల్చోకూడదని ఐఎండీ హెచ్చరించింది.

  • ఈ ఆకస్మిక వర్షాలకు కారణం మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది.
  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More