Ramappa Temple Somasutram Restoration : కాకతీయుల శిల్పకళా ప్రతీక, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రామప్ప దేవాలయం గర్భగుడిలోని ప్రాచీన ‘సోమసూత్రం’ను ASI హైదరాబాద్ బృందం విజయవంతంగా పునరుద్ధరించింది.

రామప్ప దేవాలయంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత పురావస్తు సర్వేక్షణ (ASI) బృందం…. ఒక అరుదైన, అత్యంత కీలకమైన పునరుద్ధరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. దేవాలయ గర్భగుడిలో శివలింగానికి నిర్వహించే అభిషేక జలాలు వెలుపలికి ప్రవహించే ప్రాచీన మార్గమైన 'సోమసూత్రం' (అభిషేక జలాల మార్గం) శతాబ్దాలుగా మట్టి, ఇతర వ్యర్థాలతో పూడుకుపోయింది.
ఈ సమస్య కారణంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించడంలో, ఆ జలాలు బయటకు సాఫీగా సాగిపోవడంలో తీవ్ర అంతరాయం ఏర్పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఏఎస్ఐ నిపుణులు…. ప్రాచీన కట్టడానికి ఎటువంటి చిన్న ప్రమాదం కూడా వాటిల్లకుండా అత్యంత సాంకేతిక పద్ధతులతో సోమసూత్రాన్ని పునరుద్ధరించారు.
ఆధునిక సాంకేతికతతో….
చారిత్రక నిర్మాణాలకు పునర్జన్మనిచ్చే క్రమంలో ఈ పునరుద్ధరణ ప్రక్రియ ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. రాతి నిర్మాణాల్లో ఏర్పడిన పూడికను గుర్తించి, తొలగించేందుకు ఏఎస్ఐ నిపుణులు 3D మ్యాపింగ్ సాంకేతికతను, ఎండోస్కోపిక్ కెమెరాలను ఉపయోగించారు. కట్టడం లోపలి భాగాన్ని స్పష్టంగా పరిశీలించిన అనంతరం, రాళ్లకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా 'సాఫ్ట్-డ్రిల్లింగ్' వంటి అత్యాధునిక శాస్త్రీయ పద్ధతులను అమలు చేశారు. కాకతీయుల కాలం నాటి ఇంజనీరింగ్ అద్భుతాలకు ఏమాత్రం విఘాతం కలగకుండా, సోమసూత్రం మార్గంలో ఉన్న పూడికను, వ్యర్థాలను పూర్తిగా తొలగించారు.
సోమసూత్ర మార్గం పునరుద్ధరణ పూర్తికావడంతో ఇకపై భక్తులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆగమశాస్త్ర నియమాల ప్రకారం శ్రీరామలింగేశ్వర స్వామికి నిత్య అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించుకోవచ్చని ఆలయ వర్గాలు వెల్లడించాయి. దేవునికి సమర్పించిన అభిషేక జలాలు సోమసూత్రం గుండా సజావుగా ప్రవహించి బయటకు వెళ్లే ఏర్పాటు పునరుద్ధరించబడటంతో అర్చకులు, స్థానిక భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పునరుద్ధరణ ద్వారా కాకతీయ నిర్మాణ వైభవాన్ని కాపాడటంతో పాటు, ఆలయంలో ధార్మిక విధులను పునరుద్ధరించినట్లయింది.
300 ఏళ్ల తర్వాత… ఈ ప్రాచీన సోమసూత్రం పునరుద్ధరణతో రామప్ప ఆలయంలో మళ్లీ పూర్వపు ధార్మిక వాతావరణం సంతరించుకుంది. ఇకపై భక్తులు, అర్చకులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం శివలింగానికి నిత్య అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించునే అవకాశం ఏర్పడింది. ఆలయ వర్గాలు తెలిపాయి. కాకతీయ కాలం నాటి శిల్పకళా సంపదను, ఇంజనీరింగ్ అద్భుతాన్ని పునరుద్ధరించినందుకు స్థానిక భక్తులు, చరిత్రకారులు ఏఎస్ఐ బృందాన్ని విశేషంగా ప్రశంసిస్తున్నారు.
{{/usCountry}}300 ఏళ్ల తర్వాత… ఈ ప్రాచీన సోమసూత్రం పునరుద్ధరణతో రామప్ప ఆలయంలో మళ్లీ పూర్వపు ధార్మిక వాతావరణం సంతరించుకుంది. ఇకపై భక్తులు, అర్చకులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం శివలింగానికి నిత్య అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించునే అవకాశం ఏర్పడింది. ఆలయ వర్గాలు తెలిపాయి. కాకతీయ కాలం నాటి శిల్పకళా సంపదను, ఇంజనీరింగ్ అద్భుతాన్ని పునరుద్ధరించినందుకు స్థానిక భక్తులు, చరిత్రకారులు ఏఎస్ఐ బృందాన్ని విశేషంగా ప్రశంసిస్తున్నారు.
{{/usCountry}}