తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అప్జేట్ - సప్లిమెంటరీ పరీక్ష తేదీల్లో మార్పు, మే 28న పరీక్ష వాయిదా
Telangana Inter Supplementary Exams 2026 : మే 28న జరగాల్సిన ఎన్విరాన్మెంట్ స్టడీస్ పరీక్షను తెలంగాణ ఇంటర్ బోర్డు వాయిదా వేసింది. బక్రీద్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Telangana Inter Supplementary Exams 2026 : ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలపై ఇంటర్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. బక్రీద్ పండుగ సెలవు దినాన్ని సవరించిన నేపథ్యంలో మే 28వ తేదీన జరగాల్సిన పరీక్షను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం…. మే 28 (గురువారం) నాడు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ (Environmental Education) పరీక్ష జరగాల్సి ఉంది. కానీ ఈ తేదీన బక్రీద్ రావటంతో…. మరుసటి రోజు అనగా మే 29, 2026 (శుక్రవారం) నాడు ఈ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
మే 29వ తేదీకి మార్పు…
మే 29వ తేదీన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 01:00 గంటల వరకు ఈ ఎగ్జామ్ ఉంటుందని ఇంటర్ బోర్డు తెలిపింది. కేవలం మే 28న జరగాల్సిన పరీక్షలో మాత్రమే మార్పు ఉంటుందని…. మిగిలిన పరీక్షల షెడ్యూల్ యథాతథంగా (ఎలాంటి మార్పులు లేకుండా) కొనసాగుతుందని బోర్డు స్పష్టం చేసింది.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్ అందరూ ఈ మార్పును తక్షణమే గమనించాలని బోర్డు ఆదేశించింది. సవరించిన పరీక్షా తేదీ సమాచారాన్ని విద్యార్థులందరికీ, వారి తల్లిదండ్రులకు చేరేలా విస్తృత ప్రచారం కల్పించాలని సూచించింది. ఫలితంగా విద్యార్థులు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా చూసుకోవాలని కోరింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కూడా ఈ మార్పును నోట్ చేసుకుని కొత్త షెడ్యూల్ ప్రకారం పరీక్షకు హాజరుకావాలని తెలిపింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

