...
...
Next Story

RGUKT Basara Counselling 2026 : ఇవాళ్టి నుంచి బాసర ఐఐఐటీ కౌన్సెలింగ్ - మీ వద్ద ఉండాల్సిన సర్టిఫికెట్లు

RGUKT Basara Counselling 2026 : బాసర ఐఐఐటీ (RGUKT) ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. మొదటి విడత కింద ఎంపికైన అభ్యర్థులకు ఇవాళ్టి నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.

Published on: Jun 05, 2026 01:17 PM IST
Advertisement

బాసర రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సు ప్రవేశాలకు సంబంధించి కీలక అప్‌డేట్ విడుదల చేసింది. మొదటి విడత ఎంపికల జాబితాలో చోటు దక్కించుకున్న విద్యార్థులకు ఇవాళ్టి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు నిర్దేశిత తేదీలలో బాసర క్యాంపస్‌కు నేరుగా హాజరై తమ ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకోవాలని వర్సిటీ అధికారులు సూచించారు.

ఐఐఐటీ కౌన్సెలింగ్
ఐఐఐటీ కౌన్సెలింగ్

మెరిట్ జాబితాలోని అభ్యర్థుల సీరియల్ నంబర్ల ఆధారంగా మూడు రోజుల పాటు ఈ కౌన్సెలింగ్ సదుపాయాన్ని కల్పించారు. ఏ రోజు ఏయే నంబర్ల వారికి కౌన్సెలింగ్ ఉంటుందనే పూర్తి షెడ్యూల్ వివరాలను అధికారులు ప్రకటించారు.

కౌన్సెలింగ్ షెడ్యూల్ తేదీలు:

  • ఇవాళ (జూన్ 5, 2026) : ప్రవేశాల మెరిట్ జాబితాలో సీరియల్ నంబర్ 1 నుంచి 564 వరకు స్థానం సంపాదించుకున్న అభ్యర్థులందరూ ఇవాళ (జూన్ 5వ తేదీన) కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.
  • రెండో రోజు (జూన్ 6, 2026) : జాబితాలో సీరియల్ నంబర్ 565 నుండి 1128 వరకు ఉన్న విద్యార్థులకు శనివారం అంటే జూన్ 6వ తేదీన కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహిస్తారు.
  • మూడో రోజు (జూన్ 8, 2026) : కౌన్సెలింగ్ చివరి రోజున, అంటే జూన్ 8వ తేదీ సోమవారం నాడు సీరియల్ నంబర్ 1129 నుంచి 1691 వరకు ఉన్న మిగిలిన విద్యార్థులందరికీ ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేస్తారు.

కౌన్సెలింగ్‌కు తీసుకువెళ్లాల్సిన ధ్రువపత్రాలు :

  • పదో తరగతి మార్కుల మెమో
  • అభ్యర్థి చివరిగా చదువుకున్న స్కూల్ లేదా విద్యాసంస్థ నుంచి జారీ చేసిన బదిలీ పత్రం (TC) వెంట తీసుకురావాలి.
  • స్థానికతను నిర్ధారించడానికి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థి చదివిన పాఠశాలల నుంచి పొందిన స్టడీ లేదా బోనఫైడ్ సర్టిఫికెట్లు అవసరం అవుతాయి.
  • రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే అభ్యర్థులు (SC/ST/BC) సమర్థుడైన ప్రభుత్వ అధికారి ద్వారా కేవలం 'మీసేవ' (MeeSeva) కేంద్రం నుంచి పొందిన ఒరిజినల్ కుల ధ్రువీకరణ పత్రాన్ని చూపించాలి.
  • ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) అభ్యర్థులు తమ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్‌ను 2026 ఏప్రిల్ 1వ తేదీన లేదా ఆ తర్వాత తీసుకున్నదై ఉండాలి.
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు ఇతర ప్రయోజనాల కోసం మీసేవ ద్వారా పొందిన లేటెస్ట్ ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఈ సర్టిఫికెట్ కూడా ఖచ్చితంగా 2026 ఏప్రిల్ 1వ తేదీన లేదా ఆ తర్వాత జారీ చేసినదై ఉండాలి.
  • అభ్యర్థికి సంబంధించిన ఆరు (6) సరికొత్త పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలి. వీటితో పాటు, విద్యార్థి కుటుంబ సభ్యులలో ఏవైనా ముగ్గురు వ్యక్తుల (తల్లిదండ్రులు అందుబాటులో లేని పక్షంలో లోకల్ గార్డియన్స్‌గా వ్యవహరించే వారి) తలా రెండు (2) చొప్పున పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం. యూనివర్సిటీ ఐడీ కార్డుల జారీ కోసం, సెలవుల్లో విద్యార్థిని బయటకు తీసుకువెళ్లేందుకు అనుమతించేందుకు గాను ఈ ఫోటోలను సేకరిస్తారు.
  • విద్యార్థికి సంబంధించిన ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఆధార్ కార్డ్) జిరాక్స్ కాపీని జతచేయాల్సి ఉంటుంది.
  • ఓపెన్ లేదా అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ (Unreserved Category) కింద సీటు పొంది, నివాస ఆధారంగా ప్రవేశాన్ని కోరుకునే అభ్యర్థులు మాత్రమే ఈ పత్రాన్ని సమర్పించాలి.
  • అభ్యర్థి తెలంగాణ రాష్ట్రంలో కనీసం 10 సంవత్సరాల పాటు నివసించినట్లు నివాస ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి (రాష్ట్రం వెలుపల చదువుకున్న లేదా ఉద్యోగం చేసిన కాలాన్ని మినహాయించి).
  • ప్రభుత్వ జనరల్ ఫిజీషియన్ (ఎండీ జనరల్ మెడిసిన్ చదివిన ప్రభుత్వ డాక్టర్) ద్వారా పొందిన ఫిట్‌నెస్ లేదా మెడికల్ సర్టిఫికెట్‌ను అభ్యర్థులు తప్పనిసరిగా సమర్పించాలి.

విడతల వారీగా సీట్లను భర్తీ చేస్తారు. విద్యార్థులు సాధించిన టెన్త్ మార్కుల ఆధారంగానే ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. అధికారులు కేటాయించిన తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకాని అభ్యర్థులు తమ సీటును కోల్పోతారు. ఆ ఖాళీలను తదుపరి విడత (Second Phase) కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. బాసరలోని 1650 సీట్లు మాత్రమే కాకుండా… మహబూబ్‌నగర్‌ లోని ఐఐఐటీ క్యాంపస్ లో 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి. https://www.rgukt.ac.in/admissions2026.html లింక్ పై క్లిక్ చేసి ఎంపికైన వారి వివరాలను చెక్ చేసుకోవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe