RGUKT Basar Selection List 2026 :రాష్ట్రంలోని సాంకేతిక విద్యా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బాసర ఐఐఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బి.టెక్ (B.Tech) కోర్సులో అడ్మిషన్లు కల్పిస్తారు.

ఈ ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ ఆధారంగా మొదటి విడత ఎంపికైన వారి ఫలితాలను విశ్వవిద్యాలయ అధికారులు శనివారం అధికారికంగా విడుదల చేశారు. వీటిని అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
పదో తరగతి లో సాధించిన మార్కులు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తించే రిజర్వేషన్ల ఆధారంగా ఈ సీట్ల కేటాయింపు జరిగింది. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు నిబంధనల ప్రకారం కేటాయించిన డిప్రెసియేషన్ స్కోర్ (డిప్రైవేషన్ స్కోర్) కూడా ఈ ఎంపికలో కీలకంగా ఉంటుంది.
ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?
బాసర ఐఐఐటీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంపిక జాబితాను కింది విధానం ద్వారా తనిఖీ చేసుకోవచ్చు…
- మొదటగా ఆర్జీయూకేటీ (RGUKT) అధికారిక అడ్మిషన్ల వెబ్సైట్ పేజీ అయిన https://www.rgukt.ac.in/admissions2026.html ను సందర్శించాలి.
- హోంపేజీలో అందుబాటులో ఉన్న ‘Provisional Selection Results of UG Admissions 2026-27’ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మరో విండో ఓపెన్ అవుతుంది. ఇందులోని సెలెక్షన్ స్టేటస్ లింక్ పై నొక్కాలి.
- విద్యార్థి అప్లికేషన్ నంబర్ , పుట్టిన తేదీని నమోదు చేయాలి.
- సబ్మిట్ చేస్తే మీ రిజల్ట్ డిస్ ప్లే అవుతుంది
మొదటి విడత జాబితాలో సీటు దక్కించుకున్న విద్యార్థులకు బాసర క్యాంపస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ (కౌన్సెలింగ్) నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజినల్ టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో, టీసీ, స్టడీ అండ్ కాండక్ట్ సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ పత్రం , ఆదాయ ధృవీకరణ పత్రం , రేషన్ కార్డ్ తదితర పత్రాలతో పాటు నిర్ణీత ఫీజుతో క్యాంపస్కు హాజరుకావాల్సి ఉంటుంది.
{{/usCountry}}మొదటి విడత జాబితాలో సీటు దక్కించుకున్న విద్యార్థులకు బాసర క్యాంపస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ (కౌన్సెలింగ్) నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజినల్ టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో, టీసీ, స్టడీ అండ్ కాండక్ట్ సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ పత్రం , ఆదాయ ధృవీకరణ పత్రం , రేషన్ కార్డ్ తదితర పత్రాలతో పాటు నిర్ణీత ఫీజుతో క్యాంపస్కు హాజరుకావాల్సి ఉంటుంది.
{{/usCountry}}జూన్ 5వ తేదీ నుంచి ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. విడతల వారీగా సీట్లను భర్తీ చేస్తారు. విద్యార్థులు సాధించిన టెన్త్ మార్కుల ఆధారంగానే ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. అధికారులు కేటాయించిన తేదీల్లో కౌన్సెలింగ్కు హాజరుకాని అభ్యర్థులు తమ సీటును కోల్పోతారు. ఆ ఖాళీలను తదుపరి విడత (Second Phase) కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. బాసరలోని 1650 సీట్లు మాత్రమే కాకుండా… మహబూబ్నగర్ లోని ఐఐఐటీ క్యాంపస్ లో 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి.