...
...
Next Story

RGUKT IIIT Results 2026 : బాసర ఐఐఐటీ ప్రవేశ ఫలితాలు విడుదల - రిజల్ట్ ఇక్కడ చెక్ చేసుకోండి

RGUKT Basar Selection List 2026 : బాసర ఐఐఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైన అభ్యర్థుల వివరాలను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.జూన్ 5వ తేదీ నుంచి ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది.

Published on: May 30, 2026, 21:18:10 IST
Advertisement

RGUKT Basar Selection List 2026 :రాష్ట్రంలోని సాంకేతిక విద్యా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బాసర ఐఐఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బి.టెక్ (B.Tech) కోర్సులో అడ్మిషన్లు కల్పిస్తారు.

బాసర ఐఐఐటీ
బాసర ఐఐఐటీ

ఈ ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ ఆధారంగా మొదటి విడత ఎంపికైన వారి ఫలితాలను విశ్వవిద్యాలయ అధికారులు శనివారం అధికారికంగా విడుదల చేశారు. వీటిని అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

పదో తరగతి లో సాధించిన మార్కులు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తించే రిజర్వేషన్ల ఆధారంగా ఈ సీట్ల కేటాయింపు జరిగింది. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు నిబంధనల ప్రకారం కేటాయించిన డిప్రెసియేషన్ స్కోర్ (డిప్రైవేషన్ స్కోర్) కూడా ఈ ఎంపికలో కీలకంగా ఉంటుంది.

ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?

బాసర ఐఐఐటీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంపిక జాబితాను కింది విధానం ద్వారా తనిఖీ చేసుకోవచ్చు…

  • మొదటగా ఆర్‌జీయూకేటీ (RGUKT) అధికారిక అడ్మిషన్ల వెబ్‌సైట్ పేజీ అయిన https://www.rgukt.ac.in/admissions2026.html ను సందర్శించాలి.
  • హోంపేజీలో అందుబాటులో ఉన్న ‘Provisional Selection Results of UG Admissions 2026-27’ లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ మరో విండో ఓపెన్ అవుతుంది. ఇందులోని సెలెక్షన్ స్టేటస్ లింక్ పై నొక్కాలి.
  • విద్యార్థి అప్లికేషన్ నంబర్ , పుట్టిన తేదీని నమోదు చేయాలి.
  • సబ్మిట్ చేస్తే మీ రిజల్ట్ డిస్ ప్లే అవుతుంది

జూన్ 5వ తేదీ నుంచి ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. విడతల వారీగా సీట్లను భర్తీ చేస్తారు. విద్యార్థులు సాధించిన టెన్త్ మార్కుల ఆధారంగానే ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. అధికారులు కేటాయించిన తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకాని అభ్యర్థులు తమ సీటును కోల్పోతారు. ఆ ఖాళీలను తదుపరి విడత (Second Phase) కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. బాసరలోని 1650 సీట్లు మాత్రమే కాకుండా… మహబూబ్‌నగర్‌ లోని ఐఐఐటీ క్యాంపస్ లో 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ లింక్ పై క్లిక్ చేసి బాసర ఐఐఐటీ ప్రవేశాల రిజల్ట్ నేరుగా చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe