జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి పై ఆగి ఉన్న ఇసుక లారీని తెలంగాణ ఆర్టీసీ రాజధాని బస్సు (టీజీ 03Z 0046) వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది.

ఈ ఘటనలో హైదరాబాద్ కు చెందిన పులంపరి ఓం ప్రకాష్ (75), హనుమకొండలోని బాలసముద్రంకు చెందిన నవజీత్ సింగ్ (48) అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 16 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. హన్మకొండ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం వద్దకు వెంటనే చేరుకున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు . కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇటీవలే రాష్ట్రంలో పలుచోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందర్నీ కలిచివేసింది. కంకర లోడుతో వెళ్తున్న ఓ లారీ… ఆర్టీసీ బస్సుపై పడింది. ఈ ఘటనతో బస్సులోని చాలా మంది ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. ఈ సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. 19 మంది మరణించారు. ఇదే కాకుండా… కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో కూడా ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం లేకున్నప్పటికీ… పలువురు గాయపడ్డారు.
మరోవైపు ఆర్టీసీ ప్రమాదాలపై ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లకు నిరంతరం శిక్షణతో పాటు ప్రతి బస్సుకు ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరి అనే నిబంధనను కఠినంగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. డ్రైవర్లకు నిరంతరం మెడికల్ టెస్ట్లు నిర్వహించాలని యోచిస్తోంది. ప్రమాదాలు తగ్గించడానికి డ్రైవర్లకు నిరంతర శిక్షణ, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఇటీవలనే రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
{{/usCountry}}మరోవైపు ఆర్టీసీ ప్రమాదాలపై ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లకు నిరంతరం శిక్షణతో పాటు ప్రతి బస్సుకు ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరి అనే నిబంధనను కఠినంగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. డ్రైవర్లకు నిరంతరం మెడికల్ టెస్ట్లు నిర్వహించాలని యోచిస్తోంది. ప్రమాదాలు తగ్గించడానికి డ్రైవర్లకు నిరంతర శిక్షణ, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఇటీవలనే రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
{{/usCountry}}