రైతు భరోసా నిధులు విడుదల.. కాటారంలో కేసీఆర్కు రేవంత్ రెడ్డి పవర్ఫుల్ ఛాలెంజ్
Rythu Bharosa Funds Released : పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి రైతులకు నీరిచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చే చట్టాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజాపాలనలో రైతు ఉత్సవాల పేరుతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లిలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. సభా వేదిక నుంచే రెండో విడత రైతు భరోసా నిధులను (రూ. 5,700 కోట్లు) విడుదల చేశారు.

రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఏడాదిలోపే చేసి చూపించామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్నారు. 25.35 లక్షల మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద రూ.22 వేల కోట్లు వేశామని గుర్తుచేశారు. గత విడతలో రైతుభరోసా కింద 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు వేశామన్న సీఎం.. తాజాగా రెండో విడతగా రూ.5,700 కోట్లకుపైగా రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. మిగతా రూ.3,300 కోట్లు వచ్చే నెలలో రైతుల ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు.
కేసీఆర్ను పాపాల భైరవుడుగా అభివర్ణిస్తూ రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. ఫామ్హౌస్లో పడుకునే పాపాల భైరవుడు మళ్లీ ఎందుకు రావాలి? నేరెళ్లలో దళితులను ఇసుక లారీలతో తొక్కించినందుకా? అని అడిగారు. వాస్తు పేరుతో సచివాలయాన్ని కూల్చి, తండ్రి కొడుకులు తలో ఫామ్హౌస్ కట్టుకున్నారని ధ్వజమెత్తారు. పేదలకు బతుకమ్మ చీరల పేరుతో పనికిరాని బట్టలు పంచిన గడీల దొరల పాలన మళ్లీ రాకూడదని హెచ్చరించారు.
జీవన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన చరిత్రంతా తెలుసు అన్నారు. 40 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి 14 సార్లు బీ-ఫామ్ ఇచ్చి గౌరవించిందని గుర్తు చేశారు. ఒక్క ఏడాది పదవి లేకపోతే కార్యకర్తల గుండెలపై తన్ని శత్రువుల పంచన చేరుతారా? అని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి వెనకున్న మచ్చలన్నీ తనకు తెలుసని, ఆయన స్వార్థం కోసమే పార్టీ మారుతున్నారని ఆరోపించారు.
70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించామని రేవంత్ రెడ్డి అన్నారు. ఒకరికి పదవి రాకపోతే.. ప్రజాప్రభుత్వం పోవాలా అన్నారు. బిడ్డ, కొడుకు, తండ్రి ఇలా తలో ఫామ్హౌస్ కట్టుకున్నారని ఆరోపించారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలనే ఆలోచన ఏనాడైనా వచ్చిందా? అని అడిగారు. వేములవాడకు రూ.100 కోట్లు ఇస్తానని ప్రకటించి పదేళ్లలో ఒక్క రూపాయి ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అన్నారు. '2029 ఎన్నికల్లో నీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయకపోతే నా పేరు మార్చుకుంటా. ఆరోజు నువ్వో నేనో తేల్చుకుందాం.' ఛాలెంజ్ విసిరారు రేవంత్ రెడ్డి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


