శబరిమలలో మకరజ్యోతి దర్శనం.. పులకరించిన అయ్యప్ప భక్తులు

శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. లక్షలాది మంది అయ్యప్ప భక్తులు జ్యోతి దర్శనం చేసుకుని పులకరించిపోయారు.

Published on: Jan 14, 2026 7:57 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శబరిమలలో పొన్నంబలమేడు పర్వత శిఖరాల్లో మకర జ్యోతి భక్తులకు దర్శనం ఇచ్చింది. లక్షలాది మంది అయ్యప్ప భక్తులు జ్యోతిని దర్శనం చేసుకుని పులకరించిపోయారు. ఈ సందర్భంగా శబరిమల మెుత్తం అయ్యప్ప నామస్మరణతో మారుమోగిపోయింది. అంతకుముందు పందాళం నుండి తెచ్చిన తిరువాభరణంతో స్వామివారికి అలంకరించారు.

మకరజ్యోతి దర్శనం (X)
మకరజ్యోతి దర్శనం (X)

అనంతరం స్వామివారికి హారతి ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే పొన్నంబలమేడు పర్వత శిఖరాల్లో మకర జ్యోతి దర్శనం అయింది. లక్షలాది మంది భక్తులు ఈ శుభ క్షణాన్ని వీక్షించి పరవశించిపోయారు. సాయంత్రం నిర్ణీత సమయానికి వెలిగిన దివ్య జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు సన్నిధానం, కొండలపైకి తరలివచ్చారు . స్వామియే శరణం అయ్యప్ప అనే నామస్మరణతో శబరిమల వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భక్తులు పులకరించిపోయారు.

సాయంత్రం 6.40 గంటల ప్రాంతంలో మకర జ్యోతి వెలిగింది. మకర జ్యోతి దర్శనం చేసుకోవడానికి సన్నిధానం వద్ద వేలాది మంది బారులు తీరారు. కొన్ని రోజులుగా దర్శనం కోసం వచ్చిన వారు సన్నిధానంలో వెలిగిన మకర జ్యోతిని చూడటానికి వేచి ఉన్నారు. సన్నిధానం, పంపతో సహా పొన్నంబలమేడు పర్వత శ్రేణుల్లో జ్యోతి కనిపించే అన్ని ప్రదేశాలలో గంటల తరబడి భక్తులు వేచి ఉన్నారు. మకరజ్యోతి వెలిగిన క్షణంలో పులకరించిపోయారు.

మకర జ్యోతి దర్శనానికి వచ్చే భక్తుల కోసం భద్రతా దృష్టిలో ఉంచుకుని పోలీసులు, దేవస్థానం బోర్డు, ఇతర విభాగాలు కఠినమైన భద్రత ఏర్పాట్లు చేశాయి. భక్తుల భద్రతను నిర్ధారించడానికి ప్రత్యేక నిఘా, ట్రాఫిక్ నియంత్రణను విధించినట్లు అధికారులు తెలిపారు. మకర జ్యోతి దర్శనంతో శబరిమలలో మకరవిళక్కు ఉత్సవం ముగింపు దశకు చేరుకుంటాయి.