...
...
Next Story

శబరిమల : 18 మెట్లపైకి నిమిషానికి 85 మంది భక్తులు.. స్పాట్ బుకింగ్స్ పెంపు నిర్ణయం!

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మండలం, మకరవిళక్కు వార్షిక ఉత్సవాల నేపథ్యంలో ప్రభుత్వం, దేవస్థానం బోర్డు ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.

Published on: Nov 23, 2025, 12:02:03 IST
Advertisement

శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు భక్తులు భారీగా సంఖ్యలో తరలివస్తున్నారు. అయ్యప్పను తొలివారంలోనే 5.75 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్టుగా అధికారులు వెల్లడించారు. భక్తుల తాకిడితో ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రతినిధులు ఎప్పటికప్పుడు సమావేశమై తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. శబరిమల వద్ద రద్దీ, రియల్ టైమ్ జనసమూహం ఆధారంగా స్పాట్-బుకింగ్ పరిమితిని పెంచాలని, దర్శనాలను నిమిషానికి 85 మంది యాత్రికులకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.

శబరిమల
శబరిమల

తాజాగా సమావేశంలో శబరిమల భక్తుల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచానికి అనేక చర్యలను కూడా ఆమోదించారు. ప్రస్తుతం ప్రతి నిమిషానికి దాదాపు 70 మంది భక్తులు 18 మెట్లను ఎక్కుతున్నారు. ఇప్పుడు దీనిని 85కి పెంచనున్నారు. భక్తుల దర్శనాలను వేగవంతం చేయడానికి మెట్లపై అనుభవజ్ఞులైన పోలీసు సిబ్బందిని అదనంగా నియమిస్తున్నారు.

శబరిమల అదనపు జిల్లా మేజిస్ట్రేట్ నేతృత్వంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు, పోలీసులు, ఆరోగ్యం, అగ్నిమాపక, రెస్క్యూ సర్వీసెస్, అటవీ, జల సంస్థ PWD ప్రతినిధులు పాల్గొనే ఉమ్మడి రోజువారీ సమీక్షా సమావేశం సన్నిధానంలో జరుగుతుంది. పంపా, నీలక్కల్ వద్ద కూడా ఇలాంటి సాధారణ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో లేవనెత్తిన సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరిస్తున్నారు.

తాజాగా కొన్ని సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేశారు. సన్నిధానం ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య శాఖ ఎకో సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తుంది. సన్నిధానం, పంపా, నీలక్కల్‌లలో పోలీసు యూనిట్ల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, పంపా వద్ద ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌ను అప్‌గ్రేడ్ చేస్తారు.

నీలక్కల్ పార్కింగ్ స్థలాన్ని వెంటనే పూర్తిగా వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు రియల్ టైమ్ అప్‌డేట్‌లను అందించడానికి పంపా, నీలక్కల్ వద్ద పెద్ద ఎల్ఈడీ డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేస్తారు. 24/7 టాయిలెట్ శుభ్రపరచడానికి ఎక్కువ మంది సిబ్బందిని నియమించారు. పర్యవేక్షణ కోసం సూపర్‌వైజర్లు ఉంటారు. బయో-టాయిలెట్లు, తాగునీటి సరఫరా కేంద్రాల సంఖ్యను పెంచారు.

మరోవైపు 140 మంది సభ్యులతో కూడిన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందం శనివారం బాధ్యతలు స్వీకరించింది. డిప్యూటీ కమాండర్ నేతృత్వంలో ఈ యూనిట్ సన్నిధానం, మరకూట్టంలో ఉంటుంది. 32 మంది సిబ్బందితో కూడిన మూడు షిఫ్టులలో పనిచేస్తుంది. 24 గంటల స్టాండ్‌బైలో 10 మంది సభ్యుల క్విక్ రెస్పాన్స్ బృందం సపోర్ట్ ఇస్తుంది. నవంబర్ 27న జరిగే ప్రత్యేక సమావేశంలో ఎరుమెలిలోని ఏర్పాట్లను సమీక్షిస్తారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe