Save KBR : కేబీఆర్ పార్కును కాపాడుకుందాం.. చెట్ల నరికివేతపై విమర్శలు
Save KBR పేరుతో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. హెచ్సిటీ ప్రాజెక్టు పేరుతో కేబీఆర్ పార్కును నాశనం చేస్తున్నారని ప్రభుత్వంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
కె.బి.ఆర్(కాసు బ్రహ్మానంద రెడ్డి) నేషనల్ పార్క్ చుట్టుపక్కల జరుగుతున్న చెట్ల నరికివేత, కొమ్మల కత్తిరింపును నిరసిస్తూ వందలాది మంది పౌరులు భారీ ప్రదర్శన చేపట్టారు. నగరంలోని ఈ కీలకమైన అడవిని రక్షించుకోవడానికి సాగుతున్న ఈ ఆందోళనలు నేటితో వరుసగా 10వ రోజుకు చేరుకున్నాయి.

#SaveKBR ఉద్యమ ప్రతినిధులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఏప్రిల్ 18 నుండి అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ ఆసుపత్రి మధ్య ఉన్న సెంట్రల్ మీడియన్, ఒమేగా ఆసుపత్రి నుండి కేబీఆర్ మెయిన్ గేట్ వరకు ఉన్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చెట్లను తొలగించడంతో ఈ నిరసనలు ఉధృతమయ్యాయి.
H-CITI ప్రాజెక్ట్ పేరుతో పార్కు చుట్టూ ప్రతిపాదించిన ఫ్లైఓవర్లు, అండర్ పాస్ పనులు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసమే ఈ విధ్వంసం జరుగుతోందని సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అడ్వకేట్ డాక్టర్ లుబ్నా సర్వత్, విజయ్ మల్లంగి ఈ చెట్ల నరికివేతకు ఉన్న అనుమతులపై సమాచార హక్కు ద్వారా ఆరా తీస్తున్నారు. వాల్టా (WALTA) చట్టం కింద ట్రీ ప్రొటెక్షన్ కమిటీ ఇచ్చినట్లు చెబుతున్న అనుమతులు పారదర్శకంగా లేవని వారు ఆరోపించారు. నిర్ణీత 'ఫారమ్ 14' ద్వారా అధికారి నుండి రాతపూర్వక అనుమతి లేకుండా చెట్లను నరకడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.
పబ్లిక్ పాలసీ నిపుణుడు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి స్పందిస్తూ.. ఫ్లైఓవర్ల పేరుతో కేబీఆర్ పార్కును నాశనం చేస్తున్నారని, ఇది వేయి గాయాలతో అడవిని చంపేయడమే అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉద్యమంలో ప్రధాన పిటిషనర్, కీలక కార్యకర్త కాజల్ మహేశ్వరి మాట్లాడుతూ.. ఈ ఉద్యమానికి కేవలం హైదరాబాద్ వాసుల నుండే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణ ప్రేమికుల నుండి మద్దతు లభిస్తోందని తెలిపారు.
మరోవైపు హెచ్సిటీ ప్రాజెక్ట్పై ప్రభుత్వం పునరాలోచన చేయాలని బీఆర్ఎస్ నేతలు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ‘సేవ్ కేబీఆర్’ పేరుతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు మూడు దశాబ్దాలుగా కేబీఆర్ పార్కు చుట్టూ పచ్చదనాన్ని పెంచేందుకు అన్ని ప్రభుత్వాలు కృషి చేశాయన్నారు బీఆర్ఎస్ నేతలు. పార్కు చుట్టూ భారీ వృక్షాలు పెరిగి నగరవాసులకు ఆక్సిజన్ అందిస్తున్నాయని చెప్పారు. ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, పర్యావరణాన్ని దెబ్బతీస్తూ వందలాది చెట్లను నరికివేయడం దారుణం అని విమర్శించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


